Tuesday, May 12, 2009

కళాప్రపూర్ణ కొత్త సత్యనారాయణ చౌదరి



కళాప్రపూర్ణ కొత్త సత్యనారాయణ చౌదరి
మధుర స్మృతులు
కళాప్రపూర్ణ కొత్త సత్యనారాయణ చౌదరి
జననము: శ్రీప్లవంగ-మార్గశీర్ష-బహుళ-విశాఖ
1907-12-31 మంగళ వారము
తల్లి దండ్రులు : శ్రీ రాజరత్నమ్మ- బుచ్చయ్య
గురుపాదులు: బ్రహ్మశ్రీ కంబంపాటి స్వామినాధ శాస్త్రుల వారు,మీమాంసా శిరోమణి
శ్రీ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ వరదాచార్యుల వారు,ఎం.ఏ(ఆనర్స్) కళాప్రపూర్ణ,కులపతి,మహొపాధ్యాయ
బ్రహ్మశ్రీ దువ్వూరి వెంకట రమణ శాస్త్రుల వారు,విద్వాన్,కళాప్రపూర్ణ
శ్రీమాన్ కరి రామానుజాచార్యులు, వ్యాకరణ శిరోమణి
సోదరీ సోదరులు:శ్రీమతి వెంకట రత్నమ్మ,లక్ష్మి నరసమ్మ, శ్రీమతి లక్ష్మి కాంతమ్మ, శ్రీమతి లక్ష్మీ ఈశ్వరమ్మ,శ్రీ వెంకట రత్నం
విద్యాభ్యాసం:అమృతలూరు-సంస్కృత పాఠశాల,
చిట్టిగూడూరు-నారసింహ సంస్కృత కళాశాల,
ఉభయ భాషాప్రవీణ పరీక్షోత్తీర్ణత:1929 మార్చి
ఉన్నత పాఠశాలాధ్యాపకత్వము:౧౯౨౯-౭-౨౨
ఆంగ్ల కళాశాలాధ్యాపకత్వము : ౧౯౬౯-౬-౧౫
భాషాపోషక గ్రంధ మండలి స్ఠాపకత్వము:౧౯౩౦
రచనలు:ముద్రితములి:౪౭, అముద్రితములు:౨౪
షష్టుత్సవ సమయము:౧౯౬౮జనవరి౧౪,సంక్రాంతి
కళాప్రపూర్ణ:౧౯౭౪ఆగస్టు౩ (ఆంధ్ర విశ్వవిద్యాలయము)
సంతతి: ఎనిమిది మంది-భాస్కర రావు,దివాకర దీక్షితులు,ప్రభాకరము,కమలాకరము,రత్నాకరము,శేషాద్రి శేఖరము,పద్మావతి, లీలావతి
స్థిర నివాసము:వెంకటేశ్వర నగర్, నిడుబ్రోలు, గుంటూరు జిల్లా

కొత్త సత్యనారాయణ చౌదరి పితామహుని పేరు శ్రీ వేంకట రత్నము. ఆయన మొదటి బిడ్డ బుచ్చయ్య చౌదరి. ఆయనకు యుక్త వయస్సు వచ్చినందాక ఆవంశము వారికి అభిజననము సంగంజాగర్లమూడి గ్రామము. బుచ్చయ్య సోదరులిర్వురు. ఆతమ్ముని పేరు సుబ్బయ్య. ఆ యిర్వురు బాల్యమందే తండ్రిని గోల్పోవుటం జేసియు, వారికేదో రవ్వంత మాతామహి ఆస్తిపాస్తులు వచ్చుట చేసియు, మాతామహి జన్మవాసమైన అమృతలూరు గ్రామమే వారికి కాణాచి యయ్యెను. అందువలననే సత్యనారాయణ చౌదరి తాను చిన్ననాడు వ్రాసికొన్న ఒకానొక పద్యములో, "మాది ‘అమర్తలూర’నెడి మన్నన చెందిన దిడ్డ గ్రామ"మని మురిసిపోయెను.
బుచ్చయ్య - రాజరత్నమ్మ దంపతులు కన్న సంతానము ఆరుగురిలో మగబిడ్డ లిర్వురు, వారిలో సత్యనారాయణ చౌదరి మొదటి వాడు,రెండవ యతడు వెంకట రత్నము కాగా సోదరీ మణులు వెంకట రత్నమ్మ,లక్ష్మి నరసమ్మ, లక్ష్మి కాంతమ్మ, లక్ష్మి ఈశ్వరమ్మ
ఈవంశంలో తరతరాలుగా ఆనాటికి దగిన చదువు సంధ్యలు గడించినవారు ఉన్నారనియు, పురాణములన్నను, పౌరాణికులన్నను, ధర్మమన్నను, దైవమన్నను, శ్రద్ధాభక్తులు కలవారు పెక్కులున్నారనియు ఆరోజులలో పుట్టిన వారి ‘వంశావళి’ యను పద్య గ్రంధమువలన గ్రహింపవచ్చును.
తే.గీ. ఘనుడు వేంకట రత్నాఖ్య తనయ వరులు
నిర్మలాత్ములు రసికులు ధర్మవరులు
యార్యపూజితులతి శౌర్యధుర్యులగుచు
ముఖ్యముగ బుచ్చయాఖ్య సుబ్బాఖ్యులమరె (౫౬)
(వంశానుక్రమణిక చరిత్ర నుండి)
ప్లవంగ నామ సంవత్సర మార్గశీర్ష-బహుళ-ఏకాదశీ మంగళవారములో సత్యనారాయణ చౌదరి జన్మించెను. అనగా ఆరోజు - పందొమ్మిది వందల ఏడవ సంవత్సరములో డిసెంబరు ముప్పది యొకటవతేది.

అల్పాల్పమైన ‘కొండ్రు’ సాగుజేసికొనుచు, స్వయముగా నేర్చిన ఏదో కొంత ‘జమా-కర్చు’ లెక్కల పరిజ్ఞానము చేతను, వ్యవహారదక్షత చేతను వ్యాపారసరణిలో దిగి కొంత సొమ్ము గడించి బుచ్చయ్య చౌదరి ఆగ్రామములో ఒక మంచి రైతుగా మన్నన కెక్కెను. బిడ్డల పెంపకములో, చదువు సంధ్యలు నేర్పించుటలో సంప్రదాయమును విడువక, సంస్కారము పాటించుచు పితృధర్మమును జక్కగా ఆచరించెననియే ఆయన సంతానము గర్వింతురు.

ఆరోజులలో ఇప్పటి వోలె ఇంగ్లీషు చదువులు అందఱకు అందుపాటులో ఉండెడివి కావు. జిల్లాలలో ఏరెండు మూడు చోట్లనో ఉన్నత పాఠశాలలుండుటయు, ఆచదువులకు బోవయునన్న వ్యయప్రయాసలు మిన్నగా ఉండుటయు కద్దు. ఇంచుమించు ఏబది యేండ్ల కు ( ఈ వ్యాస రచన 1964 సంవత్సరాన) మున్నే అమృతలూరు లో సంస్కృత పాఠశాలను నెలకొల్పిరి. ఆచదువులు అందఱకు దక్కవనియు, కొందరే వానిని జదువు కొందురనియు, అది పవిత్రమైన దైవ భాషయనియు, అది చదివిన వారికి సత్ప్రవర్తనమలవడుననియు, ఆభాష భారత జాతి నాగరికతకు మూలమనియు, భారతీయులలో ఆసేతుహిమాచలము అనేకత్వములో ఏకత్వమును గూర్చునది సంస్కృతమే అనియు, ఈదేశములో ప్రసిద్ధియున్నది. ఆదృష్టిలో తెలుగుదేశములో అమృతలూరు పౌరులు ఈపాఠశాలను స్థాపించి మంచి పని చేసిరనియే అభిజ్ఞులు మెచ్చుకొందురు.
నాలుగు కాసులు వెచ్చించి పాఠశాలను స్థాపించిరే కాని పాఠములు చెప్పువారెవ్వరు? అది యొక ‘సమస్య’ అయ్యెను. దేశములో ఈ పాఠములు చెప్పగలవారు లేరని కాదు, ఆచెప్ప నేర్చిన వారిని సత్కరించి ఆహ్వానించి పాఠశాలలో ప్రవేశపెట్టిన కొన్ని నాళ్ళకే ఏదో వంకతో వారు నట్టేట పుట్టి ముంచెడి వారు. ‘అబ్రాహ్మణుల’కు సంస్కృత విద్య చదువుటలో అర్హత ఉన్నదా? అని ప్రతి పండితునకు సందేహమే పుట్టెడిది. ఒక వేళ - ఆమాట పైకి చెప్పలేక, జీతనాతములమీద మమతచే ఎవ్వరో ఒకరు వచ్చి ఈకొలువులో కుదిరినప్పుడు ఊరిలోని ‘వాతావరణము’ కొంత కస్సుబుస్సు మని ఆపండితుని సాగనంపినదాక నిదురపోవని పరిస్థితి దాపరించెను.
ఆగ్రామంలో ‘రైతుపెద్ద’ ఒకరు ఈపరిస్థితిని గమనించి పాఠశాలా నిర్వహణమునకై నడుము కట్టెను. ఆయన పేరు శ్రీ పరుచూరు వెంకయ్య చౌదరి. ‘దేవుడు వెంకయ్య’ అని ఆయన గూర్చి వాడుక వున్నది. ఆయన మంచి వ్యవహార దక్షుడు, లోకజ్ఞుడును. ఆయన ముల్లు గఱ్ఱ మీద మొగము పూనిక చేసి దూరముగా నిలిచి వినుచున్నాడని తెలిసినపుడు, పౌరాణికుడు ఉన్న తెలివి పోయి పప్పులోకాలు వేయుట కద్దు. ఆయనకు సంస్కృతమన్నను, ఆయుర్వేదము మున్నగు ప్రాచీన విద్యలన్నను ఎంతో అభిమానము. ఆయభిమానము మూలముననే ఆయన పాఠశాలమీద కన్నువైచి రాయలసీమ నుండి విద్వాంసునొకని దీసికొని వచ్చి పాటశాలలో ప్రవేశపెట్టెను. గ్రాసవాసము లేర్పఱచినగాని ఈపండితులు నాలుగు కాలాలు నిలువరని పూర్వానుభవము వలన గుర్తించి ఆయనకొక ఇల్లు కట్టి యిచ్చెను. ఇంటిల్లపాదికి తగిన గ్రాసమిచ్చెడి పొలము కొంత ఆయన పేరబెట్టెను. ఆరైతు బ్రతికి యున్నంత వఱకు ఆపండితుని వలన ఆపాఠశాల చక్కగా సాగెను. ఆయిన పోయిన వెంటనే ఆపండితుడు ఆగ్రాసవాసములను చేతిలో బెట్టుకొని అనుభవించుచు ఆగ్రామము విడిచి పట్టణములో మకాము పెట్టి ఇంగ్లీషు బడిలో తిఛాఆయ్యెను. ఆయన పుణ్యమా యని పాఠశాలావిద్యార్ధులు పంచకావ్యముల దాక చదవ గలిగిరి. కాని అక్కడనే ఉన్నది అసలు సమస్య. ‘కౌముది’ ప్రారంభింపవలె. అది వ్యాకరణ శాస్త్రము గదా! శాస్త్రము జోలికి ఈపిల్లలు రారాదు గదా! రైతు పెద్ద పోయిన వెంటనే ఈసమస్య ఈతీరుగ దీర్చుకొని ఆపండితుడు తనపని తాను జూచుకొనెను.

ఈఘట్టములో కొన్నాళ్ళకు ఆయూరి వారి అదృష్టవశమున దాక్షిణాత్యులయిన పండితులొకరు పాఠశాలకు దక్కిరి. ఆయన అప్పుడే మైలాపూరు సంస్కృత కళాశాలలో ‘మీమాంస శిరోమణి’ లో ఉత్తీర్ణులయి అధ్యాపక వృత్తికి సిద్ధముగా ఉండిరి. ఆయన పేరు కంబంపాటి స్వామినాధ శాస్త్రి గారు. వారి పూర్వులు దక్షినాదికి వలసపోయిన తెలుగువారు. ఆయన అమృతలూరు పాఠశాలలో అడుగు వెట్టిన వెంటనే ఊరిలో ‘బ్రాహ్మణ్యము’ చేయగలిగినంత అలజడి జేసిపెట్టిరి. దానికా శాస్త్రివర్యులు అదరక బెదరక స్తిమితముగా నిలిచిపోయి చిరకాలము పాఠశాలను జక్కగా పెంచి ఎందఱనో శిష్యులను సిద్ధము చేసెను. ఆయన పెట్టిన బిక్ష వలననే సత్యనారాయణ చౌదరి వంటి విద్యార్ధులు ఎందఱెందరో రెక్కలు వచ్చి విద్యాగంధము రవ్వంతైన మూచూడగలిగిరి. ఆ బ్రాహ్మణ్యులు ఈప్రాంతము వారికి గావించిన అత్యంత సహకారమును మనస్సులో భావించుకొని సత్యనారాయణ చౌదరి తాను సంస్కృతములో వ్రాసిన ‘శకుంతలా’ గ్రంధమును ఆయన గారి కంకితమిచ్చి ఋణములో రవ్వంతైన దీర్చుకోగలిగితినని సంబరపడును.

సంయుక్తాంధ్ర మద్రాసు రాష్ట్రములో పళ్లెటూళ్లలో ఉన్న సంస్కృత పాఠశాలలో అమృతలూరు పాఠశాలకు మంచి పేరు ప్రతిష్ఠలున్నవి. అర్ధ శతాబ్దికి పైగా ఆప్రాంతము వారెందరో పంచకావ్యముల దాక అందే చదివి పేరుగడించిరి. ‘బాపూజి’ ఉద్యముల వంటి అనేక మహోద్యములకు సైతము పరోక్షముగా ఆ పాఠశాల అనుబంధము కలిగియుండెడిదని చెప్పవచ్చును. ఆడుపిల్లలతో సైతము సంస్కృతవిద్య అంతో ఇంతో లభించినదన్న ప్రఖ్యాతి ఆరోజులలో అమృతలూరు గ్రామమునకే దక్కినది.

ఈరచయిత ఆ పాఠశాలలో ఆఱేండ్లు సంస్కృతము చదివి ‘ప్రవేశ పరీక్ష’ లో ఉన్నత శ్రేణిలో ఉత్తీర్ణుడయి ఆవల బందరు పరగణాలో ఉన్న చిట్టిగూడూరు నారసింహ సంస్కృత కళాశాలలో జేరెను. అక్కడ గురుకులవాసముగ నాలుగేడ్లు గడిపి1929 మార్చిలో ‘ఉభయ భాషాప్రవీణ ఎ’ పరీక్షలో ఉన్నత శ్రేణిలో ఉత్తీర్ణుడయ్యెను. ఆసంవత్సరమే జూన్ 25 తేదిన గుంటూరు జిల్లాబోర్డు హైస్కూలులో ఉపాధ్యాయ పండితుడుగా ఉపక్రమించి అయిదాఱు ప్రసిద్ధములైన హైస్కూళ్ళలో ఇరువది ఎనిమిదేండ్లు అవిచ్ఛిన్నముగా పనిచేసెను.1957 వ సంవత్సరము లో జిల్లాబోర్డు ఉద్యోగమును విడిచివైచి, నిడుబ్రోలు పి.బి.ఎన్ కాలేజిలో తెలుగు లెక్చరరుగా జేరి ఏదో కొంత భాషాసేవతో పాటు ఈరచయిత కాలక్షేపము చేయుచున్నాడు.
పుస్తక రచన:

1928-29 సంవత్సరములలో సంస్కృత కళాశాలలో సంస్కృత భాషాచరిత్ర, వాజ్ఞ్మయ చరిత్ర పాఠ్యముగా విన్న అంశములను శ్రద్ధగా వ్రాసి పెట్టుకొని దానికొక ఆకృతి ఇచ్చి 1931 లో ‘వైదిక వాజ్ఞ్మయచరిత్ర’ అన్న పేరుతో తొలి గ్రంధముగా ఈరచయిత వ్రాసి అచ్చు వేయించెను. అది సంస్కృత కళాశాలలలో ‘విద్వద్బిరుద’ పరీక్షలకు పాఠ్యముగా అక్కఱకు వచ్చినది. ఆరోజులలో అచ్చునకై ఆపుస్తకమునకు ఆరువందల రూప్యములు కర్చుపెట్టి, ఇంటిలో తండ్రిగారికి సైతము చెప్పక ముద్రించుట జేసి, కొంత ‘వ్యసనము’ కలిగి, వెంటనే పాఠ్యపుస్తకములు కొన్ని వ్రాసి ఆయప్పు తీర్చి తన్మూలమున గ్రంధరచనోద్యమములో ఉత్సాహము పెంచుకొనెను. హైస్కూళ్ళలో పిల్లలకు కేవలము పాఠాలు చెప్పుటయేగాక, ప్రత్యేక వ్యాసంగముగా గ్రంధ పఠనము చేయుచు, నిత్యకృత్యముగా కొంత ‘రచన’ అభ్యాసము చేయుచు, ‘వైదిక వాజ్ఞ్మయచరిత్ర’ తోపాటు గ్రంధ మడలి యొకటి ‘స్వయంరాజా స్వయం మంత్రి’ అన్నట్లు తానే స్థాపించుకొనెను. దాని పేరు ‘భాషాపోషక గ్రంధ మండలి. దాని ఉనికిమనుకుల తీరు తియ్యములివిగో - ఇవి: "ఆంధ్ర భాషాయోషకుససియగు బలుపు నాకాంక్షించి ఈగ్రంధమండలిని వెడలించితిమి. ఏతన్మూలమున అతివిశాలమగు సంస్కృతవాజ్ఞ్మయముపైని పాశ్చాత్య పండితులు వెలయించిన విమర్శనములను ప్రదర్శింతుము. స్మృతులు పురాణములులోనగు వానిలో విశిష్టములగు వానిని అందఱికవగాహమగునటుల తేట తెలుగున వివరింతుము. సరసములగు సంస్కృతాంగ్ల గ్రంధములను ఆంధ్ర బాలురకు ఉపయుక్తమగు వానిని బయలు పఱతుము. బాలికా బాలకులకు సాహ్యపడు పద్యగద్య కావ్యములను - ‘కలిపురాణ’శ్రేణిలో ప్రకటింతుము. సంపాదకుడు,సర్వాధికారి: సత్యనారాయణ చౌదరి".

ఇట్టి సంకల్పముతో ముప్పదినాలుగేంద్లనుండి ఏదో తోచినట్లు పద్యములో గద్యములో రచన చేయుచు దరిదాపు డెబ్బది గ్రంధములను ఈరచయిత ఒక రూపునకు దెచ్చెను. వానిలో ఇప్పటికి ముప్పది యేడు మాత్రమే ముద్రితములు. ఇంటిలో ఎదిగియుండి అవివాహితలైన ఆడుపిల్లల వోలె తక్కినరచనలు అచ్చు కోసమెదురు చూడవలసిన అక్కఱ కల్గుచున్నది.

ఈరచయితకు భాషాప్రపంచములో అభిమానమూర్తి పరవస్తు చిన్నయ సూరి. సూరివంశమునకే తలమానికమైన చిన్నయ్య ఆంధ్రికి పెట్టిన భిక్ష ఇంతయంతయని చెప్పలేము. కొలమును బట్టి ఆమహావ్యక్తిని తక్కువచేసి తన్మూలమున తెలుగు వాజ్ఞ్మయమునకే అపరాధము చేసిన విద్వాంసులు మన దేశములో వున్నారు. ఆ విషయమై ఈరచయిత తనకు దోచిన ఆధారములతో ‘చిన్నయ’ అన్న పేరుతో ఒక చిన్న రచన చేసి తెలుగువారికిచ్చెను. ఇతర విద్వాంసులెందఱో పనిపూని నడుముకట్టి చిన్నయ సూరి కీర్తిమూర్తికి కళంకము తేవలెనని ప్రయత్నించినను, చిన్నయ హృదయమును చక్కగా గ్రహించి ఏబది యేండ్లుగా శిష్యకోటికి సూరి రచనలు బోధించుచు తాము గుర్తించిన సత్యమును నిరాఘాటముగా లోకమునకు వెల్లడి చేసిన మహావిద్వాంసులు బ్రహ్మశ్రీ దువ్వూరి వేంకటరమణ శాస్త్రి వర్యులను ఈఘట్టములో పేర్కొననిచో కృతఘ్నతయే కావచ్చును. సంస్కృత భాషలో ‘కౌముది’కి ఈడుజోడు కాగలిగి తెలుగులోపుట్టిన సర్వ వ్యాకరణములకు మేలుబంతియైన బాలవ్యాకరణమునకు సమీక్షగా ‘రమణీయమను’ బృహద్గ్రంధమును రచించి దువ్వూరి వారు తెలుగువారికి జేసిన మహోపకారము ఇంతింతకాదు. ఆశాస్త్రి వర్యుల ముఖ్య శిష్యులలో ఒకడుగా ఉండనోచితినని ఈరచయిత అనుక్షణము సంబర పడుచుండును.

పూర్వ వాజ్ఞ్మయములొ కులగోత్రాలపేరుతో జాతిమతముల వంకతో కావలసినన్ని కల్మషములు పుట్టి పెరిగి- అదియొక సంప్రదాయముగా సనాతనాచారముగా వర్ధిల్లి తన్మూలమున పీడుతులైన వారికి సైతము అదే ఉపాస్యమన్న ధోరణిలో వెలసినది. ఈదేశములో ఈరహస్యమెఱిగినవారు ఎందరో ఉన్నను, రచనలో కవితలో నిబ్బరముగా నిరాటంకముగా బయటపెట్ట నేర్చిన దిట్ట ఒక్క త్రిపురనేని రామస్వామి చౌదరి యనియే చెప్పవలెను. ఆత్రోవలో వ్యాసంగము చేసి ఆ రహస్యములను మఱికొన్నింటిని గుర్తించి ఆవంకకే కలము త్రిప్పి ఈరచయిత ‘కలిపురాణ’ శ్రేణిని వెలువరింప సాగెను. ‘కలిపురాణ’మన్న పద్యకావ్యము ఇంతవఱకు అయిదు భాగములుగా వెడలినది.

వర్ణాశ్రమ ధర్మమన్నపేరిట సనాతనాచారమన్న ధోరణిలో అవకాశము కలిగినప్పుడెల్ల తెలుగులో ‘విశ్వనాధ వారు’ వ్రాసెడి వ్రాతలు చదివి ఏవగించుకొనువారు నూటికి ఎనుబదిమందికి పైగాఉన్నను, వ్రాతలో వానిని ఖండించువారు ముందునకు రారైరి. ఆయనకేదో ఇంత ప్రతిష్ట ఉన్నదన్న భ్రమచేత -ఆయన నోటినుండి వచ్చిన మాటలకెల్ల ‘భజగోవిందము’ పాడు శిష్య పరమాణవులు కొందరు పిల్లగంతులు వేయుచుండుట చేత, అధికారికముగా సాంఘికముగా రాజకీయముగా ఏవేవో ఇబ్బందులున్నవన్న స్వార్ధముచేత విశ్వనాధ వారి రచనల లోని అవకతవకలను దెలిసియు గొందరు గ్రందస్ధము చేయరు. విషయమందే గాక రచనలో శయ్యలో శాబ్దికముగా ఆర్ధికముగా ఆయన చేసెడి దోషములు లక్షలుగానున్నను ఉపేక్షవహించుటయే విద్వాంసులనేకులకు ఆచారమైనది. శ్రీమద్రామాయణకల్పవృక్షము మహాకావ్యమనియు, కవిత్రయము వారు పోతనామాత్యులు భారత,భాగవములను తెలుగునకు దెచ్చిరేగాని, వాల్మీకమునకనువాదము నేటి వఱకు సరియైనది రాలేదనియు, ఆలోపము ‘వైశ్వనాధము’తో తీరినదనియు, వాల్మీకమునకీకల్పము అచ్చముగా భాష్యమువంటిదనియు, ప్రసిద్ధులైన సంస్కృతాంధ్రమహాకవులనేకులు పోవని పోకడలు ఈకల్పవృక్షములో వున్నవనియు, శ్రీనాధాదులనే గాక వాల్మీకిని సైతము ఈగ్రంధకర్త ఒకవిధముగ రచనలో మించెననియు, విశ్వనాధ వారి బృందముతో బాటు విశ్వనాధులవారికి ఈభావమున్నట్లు ఉపన్యాసముల వలన ప్రసంగముల వలన స్పష్టమగుచున్నది. ఈభావమే ప్రకోపించి ఎదురెవ్వరు లేరన్న ధీమాతో, భాష్యమనివంకపెట్టి వాల్మీకమును వికృత పరచి అందలి పాత్రలను అపాత్రలను జేసి, లాక్షణికముగా లక్షోపలక్షలుగా అపభ్రంశములు కావించి తెలుగు మర్యాదనే చెఱచి, ఛందస్సునే విఱిచి, విశ్వనాధవారు యదేచ్ఛముగ సంచరించిన ఘట్టములనేకములున్నవి. ‘విశ్వనాధ పంచశతి’ పేరుపెట్టి ఆయన వ్రాసిన అయిదు వందల పద్యములలో బూతులెన్నెన్ని కలవో, జాతి నింద, వర్గ దూషణ ఎంతెంత కలదోసోపపత్తికముగా ఈరచయిత వ్రాసియుండెను. దాని పేరు ‘పంచశతీ పరీక్ష’. తీరిక లేని వారు, ఓపిక చూపలేని వారు, విశ్వనాధ రచనలు అన్నింటిని జూడవలసిన పనిలేదు. ‘పంచశతీ పరీక్ష’ అనెడి ఈచిన్న సమీక్షను జూచిన జాలు, ఆయన తత్వము అక్షరాల ఆరచనలో ప్రతిబింబించి కన్నులకు గట్టినట్లు స్పష్టమగును. వాల్మీకమొక చేతిలో బెట్టుకొని ‘కల్పవృక్షము’ను ప్రత్యక్షరము పరిశీలించి చూడగా తెలుగు బాసకు ఆయన చేసిన ద్రోహము, వాల్మీకి మహర్షికి ఆయన కావించిన అపచారము వ్యక్తము కాగలదన్న భావముతో ఈరచయిత ‘కల్పవృక్షఖండన’మని పేరు వెట్టి తెలుగువారి కెఱుక పఱిచెను. ఇదే ధోరణిలో ‘వేనరాజు - వేయిపడగ’లను గూడ పరీక్షలో పెట్టి ఆయన తత్త్వము స్పష్టపఱుపవలెనన్న సంకల్పముతో ఈ రచయిత కృషి చేయుచున్నాడు.

ఇక అధ్యాపక వృత్తి:

1929 లో హైస్కూలులో ఉపాధ్యాయుడుగా జేరి ఇరువది ఎనిమిదేండ్లు చేసిన బోధకు - కృషికి - కాలేజి ప్రవేశము మిక్కిలిగా సహకరించినదని ఈ రచయిత భావము. ఆచదువులకు ఈచదువులకు అంతరమెంతో ఉన్నందువలనను కఱువు తీరునట్లు కవిత్రయము వారి రచనలు గాని, లాక్షణిక భాగములుగాని ప్రసిద్ధ ఘట్టములెన్నో కాలేజిలో పాఠ్యములుగా ఉండుటవలన ఈరచయిత గ్రంధరచనోద్యమమునకెంతో స్థాయి చిక్కినదని చెప్పవచ్చు. రచనకు గావలసిన గ్రాసమే గాక విశ్రాంతియు మిక్కిలిగా దొరుకుటచే దినదినాభ్యుదయముగా ఏదో కొంత భాషాసేవ చేయుటకు అవకాశము చిక్కినది.

అడ్డమైన దేవిరిగొట్టు నాశ్రయించి లాతివారి పడిపంచలబడి యాచించి సొమ్ము తెచ్చి వ్రాసినవి అచ్చువేయించు కొనుటలో మనసొప్పని ఈరచయిత చీమవోలె కూడ బెట్టిన ఆరవ్వంత సొమ్మునే ఆధారము చేసికొని అనువైనవేళలో అచ్చుపని జూచుకొనుటయే సంప్రదాయమైనది. దేశమునకో, భాషకో, రాజకీయములకో, కళలకో, జీవితమంకితమిచ్చిన వ్యక్తులకే ఈరచయిత రచనలు కొన్నిఅంకితమైనవి. ఈ ఘట్టములో గురువులకు, తల్లిదండ్రులకు, ముమ్మొదటనే పెద్ద పీటలు వేయుట సంభవించినది. తనకు దోచిన ధోరణిలో తనయిలువేల్పగు శ్రీనివాసునకు ఈరచయిత కొన్ని రచనలు సమర్పించుకొనెను.

ఇటీవల వయస్సుతోపాటు అనారోగ్యము పెరిగి అకటావికటలు చేయుచున్నను, సాంసారిక వ్యాపకములు వెంటబడుచున్నను,అధ్యాపక వృత్తిలో అంతగా విశ్రాంతిదొరకకున్నను, చిరకాల సంప్రదాయముగా అనుస్యూతముగా వచ్చుచున్న ‘భాషాకృషి’ విడిచిపెట్టలేదన్న సంబరము ఈరచయితకు మిక్కిలిగాగలదు. గద్యమో పద్యమో వ్యాసమో ఏవో ఇన్ని ముక్కలు వ్రాయని వారము ఈరచయితకు నిట్రుపాసన వంటిది. వేసవి సెలవులలో ఏదో ఒక రచన ఆకృతికి వచ్చి అచ్చునకెదురు చూడవలెనన్నదే ఈ రచయిత దీక్ష. చేసిన రచనలలో అనేకములు పునర్ముద్రణకెదురు చూచుచుండగా, కొంగ్రొత్తవి కంటికెదురై వ్రాతలో బంధింపబడి ఉండవలసి వచ్చుచున్నది. అయినను పరమేశ్వరానుగ్రహము వలన ఈజీవితములో ఈచేతిలో సాగిన రచనలన్నియు అచ్చునకు రావచ్చుననియే ఏదో మొండి ధైర్యములో ఈరచయిత నిలిచియుండును.

పాఠకుల పరిశీలము కోసమై ఈరచయిత కావించిన రచనలు పేర్కొనుట అప్రస్తుతము కాదనుకొందుము.
(రచయిత కొత్త సత్యనారాయణ చౌదరి గారి మనోభావాల అక్షర రూపమైన ఈరచన తేది 25-5-1964 )

కొత్త సత్యనారాయణ చౌదరి గారి రచనలు
మొత్తము రచనలు: ౭౧ ముద్రితములు: ౪౭ (౧౯౭౪)
. వైదిక వాఙ్మయ చరిత్ర ౨.సతీసప్తతి(పద్య) ౩.కధా వింశతి ౪.చంద్రా పీడచరిత్ర ౫.కామ శాస్త్రము(వాత్స్యాయన మహర్షి ) ౬.కావ్యమాల ౧వ భాగము ౭. కావ్యమాల ౨వ భాగము ౮.సుభాషితము ౯.ధర్మశాస్త్రము(మనుస్మృతి) ౧౦.కవుల కధలు ౧౧.వరరుచి ౧౨. ఈశ్వర సేవకులు ౧౩. విక్రమ కధలు ౧౪. మ్రొక్కుబడి(పద్య) ౧౫. నవనాధము(గద్య) ౧౬. బృహత్కధలు ౧౭.వత్సరాజు ౧౮. విక్రమాదిత్యము ౧౯. సాలభంజికలు ౨౦. బాపూజీ (పద్య) ౨౧. చారుదత్తము ౨౨. నీతిచంద్రిక(సవ్యాఖ్య) ౨౩. చిన్నయ్య (సూరి చరిత్ర) ౨౪. నైషధము ౨౫. కలిపురాణము (పద్య) ౨౬. ప్రతాపసింహము ౨౭. వీరపూజ ౨౮. చాణక్యము ౨౯. దివ్యమూర్తులు ౩౦. స్వరాజ్య కధలు ౩౧. మాయాభిక్షువు (పద్య) ౩౨. కలిపురాణము (౨వ భాగము) ౩౩. మాస్వామి (పద్య) ౩౪. మంజరి (పద్య) ౩౫. జాతక కధలు ౩౬. సైరంధ్రి (గద్య) ౩౭. పంచశతీ పరీక్ష (విశ్వనాధ వారి పంచశతికి విమర్శనము) ౩౮. కవిరాజు (త్రిపురనేని) ౩౯. షష్టిక (పద్య) ౪౦. సాహితి(వ్యాసములు) ౪౧. రామాయణ రహస్యాలు ౪౨. మోహన దాసు (పద్య) ౪౩. వసంతసేన (రూపకము) ౪౪. కులపతి (శ్రీ వరదాచార్య) ౪౫. కల్పవృక్ష ఖండనము ౪౬. పంచదశీ (శ్లోకములు) ౪౭. శకుంన్తలా (సంస్కృత రచన)
అముద్రితములు: ౪౮. కలిపురాణము (౩వ భా.పద్య ) ౪౯. కలిపురాణము (౪వ భా.పద్య ) ౫౦. కలిపురాణము (౫వ భా.పద్య) ౫౧. ధూర్తుని స్వగతం ౫౨. మేవాడ విజయము (గద్య) ౫౩. మహారధులు ౫౪. అంజలి (పద్య) ౫౫. లోకతంత్రము(పద్య) ౫౬. స్వరాష్ట్ర్రము (పద్య) ౫౭. త్యాగయ్య ౫౮. రామరాజభూషణము ౫౯.మాలిక (పద్య) ౬౦. కావ్య కధలు ౬౧. తెలుగు వెలుగులు ౬౨. చిత్ర కధలు ౬౩. కవిత్రయము ౬౪. పండితుడు (పద్య) ౬౫. శిశుఘ్ను(పద్య)౬౬. తెనుగు లక్షణము ౬౭. నా యుపాధ్యాయ గిరి ౬౮. బాలప్రౌఢ ప్రశ్నోత్తరమాల ౬౯. సూక్తి ముక్తావళి ౭౦. వినోద కధలు ౭౧. వాల్మీకము









సంస్మరణ
.............

‘కొత్త’ వంశ ఆదిపురుషులు -
పునుకునూళ్ళ’ గొత్రీకులు-
కొత్త వెంకటాద్రి (18 శతాబ్ది)ని
స్మరిస్తూ....
కమలాకరం కొత్త
రాజేష్ కొత్త
.....................................
‘కొత్త’ వంశం ఆద్యులైన
కొత్త వెంకటాద్రి గారి కుమారులు
కొత్త సూరన్నను
స్మరిస్తూ....
కమలాకరం కొత్త
రాజేష్ కొత్త
.................................
కొత్త సూరన్న గారి కుమారులు
కొత్త అప్పన్న ను
స్మరిస్తూ....
కమలాకరం కొత్త
రాజేష్ కొత్త
........................................
కొత్త అప్పన్న గారి కుమారులు
కొత్త సుబ్బన్న ను
స్మరిస్తూ....
కమలాకరం కొత్త
రాజేష్ కొత్త
.....................................
కొత్త సుబ్బన్న గారి కుమారులు
కొత్త కిచ్చయ్య ను
స్మరిస్తూ....
కమలాకరం కొత్త
రాజేష్ కొత్త
.......................................
కొత్త కిచ్చయ్య గారి కుమారులు
కొత్త సుబ్బయ్య ను
స్మరిస్తూ....
కమలాకరం కొత్త
రాజేష్ కొత్త
.............................................
కొత్త సుబ్బయ్య గారి కుమారులు
కొత్త వెంకట రత్నం,
ఆనందమ్మ దంపతులను

స్మరిస్తూ....
కమలాకరం కొత్త
రాజేష్ కొత్త
..............................................
కొత్త వెంకట రత్నం గారి కుమారులు
కొత్త బుచ్చయ్య,
రాజరత్నమ్మ దంపతులను

స్మరిస్తూ....
కమలాకరం కొత్త
రాజేష్ కొత్త
........................................
కొత్త బుచ్చయ్య,
రాజరత్నమ్మ దంపతుల కుమారుడు
కళాప్రపూర్ణ, పండిత
కొత్త సత్యనారాయణ చౌదరి (1907-1974)

వెంకట సుబ్బమ్మ దంపతుల కుటుంబ సభ్యులు...
కుమారులు: కొత్త దివాకర దీక్షితులు, కొత్త ప్రభాకరము, కొత్త కమలాకరము,
కొత్త రత్నాకరము, డా.కొత్త శేషాద్రి శేఖరము.
కుమార్తెలు :పద్మావతి, లీలావతి
మనమలు :డా.కొత్త శ్రీనివాస మూర్తి, కొత్త సత్యమూర్తి, కొత్త రాజేష్(శివమూర్తి)
కొత్త వికాస్, కొత్త బాలాజి.
మనమరాండ్రు: జయశ్రీ, రాజశ్రీ, కొత్త అనుపమ, బెల్లం భరణి, కొర్లకుంట శ్రీ సత్య,
మునిమనమలు: కొత్త ఫల్గుణ్, తిపిర్నేని ఆయేషా,తిపిర్నేని నమ్రత, కుర్రా హేమంత్, కొత్త పద్మశ్రీ,
కొత్త ప్రణవి, కొత్త భార్గవ్
.....................................................................................










కొత్త రాజరత్నమ్మ
(సత్యనారాయణ చౌదరి గారి మాతృ మూర్తి)


శ్రీమతి యలమంచి వెంకట నరసమ్మ
(శ్రీమతి వెంకట సుబ్బమ్మ గారి మాతృమూర్తి)


కొత్త సత్యనారాయణ చౌదరి,వెంకట సుబ్బమ్మ

కొత్త వెంకట సుబ్బమ్మ

కొత్త సత్యనారాయణ చౌదరి,వెంకట సుబ్బమ్మ

కొత్త సత్యనారాయణ చౌదరి,వెంకట సుబ్బమ్మ,
చి.దివాకర దీక్షితులు,చి.ప్రభాకరము

కొత్త సత్యనారాయణ చౌదరి,
వారి బావగారు వీరమాచనేని బుచ్చికోటయ్య
సోదరుడు వెంకట రత్నం


వడ్లమూడి రామచంద్ర ప్రసాద్,డాక్టర్ వడ్లమూడి
బాబూరాజేంద్ర ప్రసాద్, వడ్లమూడి దశరధ రామయ్య,
కొత్త సత్యనారాయణ చౌదరి,యలమంచి కాంతయ్య


సత్యనారాయణ చౌదరి గారి సోదరి శ్రీమతి క్రొత్తపల్లి లక్ష్మికాంతమ్మ,
తల్లి శ్రీమతి రాజరత్నమ్మ, సోదరి శ్రీమతి వడ్లమూడి లక్ష్మి ఈశ్వరమ్మ.
(నిలబడిన వారు) క్రొత్తపల్లి శివరామయ్య దంపతులు,
క్రొత్తపల్లి సూర్యనారాయణ గారు, క్రొత్తపల్లి బుచ్చికోటయ్య,
క్రొత్తపల్లి ప్రేమచంద్, రామినేని కృష్ణమూర్తి దంపతులు,
క్రొత్తపల్లి భాస్కర రావు దంపతులు


డాక్టర్ క్రొత్తపల్లి బుచ్చికోటయ్య దంపతులు


సత్యనారాయణ చౌదరి గారి కుటుంబం (1966 సం)

సత్యనారాయణ చౌదరి గారి సోదరి శ్రీమతి వడ్లమూడి లక్ష్మి ఈశ్వరమ్మ,
కుమారులు కృష్ణమూర్తి,రామచంద్ర ప్రసాద్ ,కుమార్తెలు
మరియు కొత్త ప్రభాకరం


సత్యనారాయణ చౌదరి గారి సోదరి శ్రీమతి వడ్లమూడి లక్ష్మి ఈశ్వరమ్మ

శ్రీమతి వడ్లమూడి లక్ష్మి ఈశ్వరమ్మ, పద్మావతి


యలమంచి ముకుందరాయుడు,మనుమడు డాక్టర్ మల్లెల క్రాంతి కుమార్

యలమంచి ముకుందరాయుడు,మనుమరాళ్ళు


డాక్టర్ మల్లెల వెంకటేశ్వరవ్రావు, డాక్టర్ యలమంచి నివేదిత

డాక్టర్ మల్లెల వెంకటేశ్వరవ్రావు, డాక్టర్ యలమంచి నివేదిత



డాక్టర్ మల్లెల క్రాంతి కుమార్, డాక్టర్ శైలజ

యలమంచి భగవన్నారాయణ

శ్రీమతి యలమంచి భగవన్నారాయణ

యలమంచి బుచ్చేశ్వర రావు






శ్రీమతి అన్నపూర్ణ సాగర్, నిర్మల, కమలాకరం, చైతన్య కుర్రా, రాజశ్రీ, రాజేష్
























మృదుల, రాజేష్

మృదుల, రాజేష్,నిర్మల

శ్రీమతి మృదుల రాజేష్,నిర్మల, కమలాకరం




శ్రీమతి రత్న మాణిక్యం, శ్రీమతి నిర్మల

కొత్త రాజేష్,మృదుల,నిర్మల

శ్రీమతి పార్వతి,కొత్త దివాకర దీక్షితులు, కొత్త ప్రభాకరం

పద్మావతి,ప్రభాకరం

ఆయేషా,పద్మావతి,నమ్రత,కల్నల్ శరత్,జయశ్రీ

శ్రీమతి విజయ ప్రభాకరం,నమ్రత,జయశ్రీ,ఆయేషా,కల్నల్ శరత్



కొత్త సత్య మూర్తి, ప్రణవి

సుభాషిణి,ప్రణవి

కొత్త సత్య మూర్తి,నమ్రత


పద్మావతి , ప్రభాకరం,డాక్టర్ మల్లెల(యలమంచి)నివేదిత,రత్నాకరం







డాక్టర్ కొత్త శేషాద్రి శేఖరం,డాక్టర్ మాధవి,
కుమారి అనుపమ,సత్య వికాస్


కుమారి అనుపమ(సత్యనారాయణ చౌదరి గారి మనుమరాలు)

పద్మావతి

డాక్టర్ భరణి
(శ్రీమతి పద్మావతి,డాక్టర్ నరసింహారావు గార్ల కుమార్తె)

లీలావతి, పద్మావతి (సత్యనారాయణ చౌదరి గారి కుమార్తెలు)







డాక్టర్ మల్లెల(యలమంచి)నివేదిత, కొత్త కమలాకరం,
కొర్లకుంట శ్రీసత్య















కొత్త వెంకట రత్నం గారి మనుమరాలు,
ఆనంద్ కుమార్-ధనలక్ష్మి గార్ల కుమార్తె
సునీత-అనీష్ ల వివాహ సందర్భంగా..





















బంధువర్గం


Mr.& Mrs Bhojaraju Yalamanchi (USA)


Smt. & Dr. Vidyabhushan Yalamanchi -
& Smt.Bhojaraju Yalamanchi


Ramana Kothapalli & Smt.
Bhojaraju & Smt.






శ్రీ సంగమేశ్వర స్వామివారి సహాయం.

వంశానుక్రమణిక చరిత్ర
కం|| శ్రీలలరసంగమేశ్వర
శైలేంద్రకుమారి హృదయజాలనచతురా
శూలధరలోకనాయక
పాలింపుము వృషభవాహప్రమదాధిపతీ|| ౧

ఉ|| శ్రీకరకొండవీటియను సీమధరన్ బరగెన్ మహోన్నతిన్
ప్రాకటమొప్పగాను మహిభాసిలు సంగమచామరల్ పురిన్
వీకమరంగ నందుతగ వేట్కలకెల్లను నాటపట్టుగన్
జోకుగ సంతతంబు కడుశోభితమై సరసాళిమెచ్చగన్|| ౨

సీ|| శిరులచేచామలన్ పురవరంబున నుత్త
రపుదిశవెలయు రమ్యముగను
ప్రాగ్భాగమున తుంగభద్ర మహానది
కడుపటమట కృష్ణ కాల్వయెసగు
నతులకూడలిదక్షిణ మున విశాలమై
భూరియనాతీత భూరుహములు
చెలగునందులను బల్ నమరె శ్రీసంగ మే
శ్వర నామముననుమా సహితమగుచు

తే||గీ|| వెలశె కడునత్రిమునిచేత యిల బ్రతిష్ట
దక్షిణామూతిన్ యంత్రవిధానమునను
ధరనుచామలన్ పురజనవరులబ్రోవ
బ్రమదమలరార వరముల నమరనొసగ|| ౩

2


సీ|| సంగమేశ్వరు కటాక్షమున ధరాస్థలి
మహితవేట్కలను చామలన్ పురము
సంగమేశ్వరుకటాక్షమున మహానంద
మహిమచేనొప్పు చామర్లపురము
సంగమేశ్వరుకటాక్షమున సంపదలచే
మానుగా వెలసె చామర్లపురము
సంగమేశ్వరుకటాక్షమున శ్రీశుభముల
మరెవైభవమున చామరలపురము

తే.గీ|| దురితజాలములణచు చామరలపురము
బరగెసద్గుణములకు చామరలపురము
బరహితమునకాస్పదము చామరలపురము
గరుణ కామూలకమును చామరలపురము|| ౪

సీ|| కాంచనమణి చిత్ర ఖచిత హర్మ్యంబులు
వికసితరంగ వల్లికలుకలిగి
బహిద్వార బంధకవాటవర్గములచే
పచ్చలతోరణాలచ్చుపడగ
మహిదేవతా రామమందిరంబుల చేత
బహువస్తు సముదాయప్రభను వెలసి
కమలాదిలతల సంకలిత వారిజముల
విలసిల్లు మహిమలవివరముగను

తే.గీ|| ప్రాకటంబుగ విద్యలకాకరంబు
ప్రాపు బహువస్తుతతులకుదాపురంబు
వీకనఘములకెల్ల నిరాకరంబు
ఆపురంబున శ్రీసతికాపురంబు ౫

3


సీ|| కాలత్రయముల శంకరపదధ్యానుడౌ
కమలాసనుమహిమగరిమయెంత
ఏకవింశతిసాలున్ బోధకుండ వధియించు
జామదగ్ని ప్రతాపజాలమెంత
ధన వృధ్ధియందున ధాటిగల్గి వహించు
ఘనునికుబేరుని ధనమదెంత
ఏరువ్రయ్యలుచేసి ఎసగిప్రకాశించు
బలశాలి బలరాము బలిమియెంత

తే.గీ|| అలపితామహపరశురా మలకరాజ
శీరవరుల సుజ్ఞానవిశేషద్రవ్య
కృషివితతులం దగింపరుగొనబుమీర
సరసులప్పురి బ్రాహ్మణక్షత్రవరులు
వైశ్యజనములు శూరులు వరలు వీట|| ౬

తె.గీ|| అట్టిశూరులలో నలరాలుచుండు
ధర్మపరులయ్యు మిగుల సత్కరుణ గాంచి
వనరయీశ్వర పదభక్తవరులునగుచు
కలుములను యిల్లువెళ్ళని కమ్మవారు||

ఉ|| సమ్మతి మీర నెమ్మదిని సంతతమున్ భగవార్చనమ్ములన్
నిమ్ముగ భక్తినిల్పుకొని యేర్పడగొల్చుచు జ్ఞానవంతులై
నిమ్మహిమాన్యతన్ దగ నటింపుచు దాస్వకులోభితంబుగా
కమ్మకులంబునొప్పె శితికంఠవర ప్రదదత్తచిత్తులై||

సీ|| శ్రీమించుప్రాగ్దిశ భూమినివాసంబు
కొత్తకులాంబుధి కువలయేశు
డగు వేంకటాద్రి నుద్దండ విక్రమునమా
నిత రాజసన్మాన నీతములను
పొంది ఐశ్వర్య సంభోగాదులందుచు
నిరంతరంబుపురహరస్మరణుడగుచు
యుర్విని భూమిదేవోత్తములకు వేడ్క
వేడలేదనకిచ్చు వితరణుండు

తే.గీ|| నౌర యీతనిసాటి రార వనియందు
సత్యవాక్యుండు సరసుండు సద్గుణుండు
సంభ్రమస్వాంతుడాశ్రిత సదయకరుడు
సనగ వెలశెను మిగుల కొడాలిపురిని|| ౯


4


తే.గీ||మహిని సంపత్కరముల చే రహినిమీర
జోకుగాపాంన్కు నూళ్ళగోత్రీకుడగుచు
వెలశెవారల వంశంబు విదితముగను
మాన్యులై వేడ్క పిదపచామరలపురిని|| ౧౦

కం||ఆ వెంకటాద్రియొకనా
డీవిధముననుండి మిగుల నెసగెడుమదినిన్
దేవునిదలచుచు శయ్యను
భావించిబరుండ రాత్రిబ్రమదంబెసగన్ || ౧౧

చం|| బరమకృపావలోలుడయి భర్లుడుతావృషభేంద్రుపైనయా
గిరివరపుత్రుగూడుకొని కిన్నెరులెల్ల నుతింపుచుండనా
వరప్రమ దాదులేర్పడగ వైభవముప్పతిలంగ బ్రేమచే
గరుణవహిల్ల నాతనికి గన్పడె స్వప్నమునందు చెచ్చెరన్ || ౧౨

తే.గీ|| చూచిపులకాంకితుండు నై చోద్యమంది
యరసిసాష్టాంగ దండమర్పించి మిగుల
లేవకున్నంతభక్తుని లేవనెత్తి
యలమినిట్లని యానతినిచ్చె బ్రీతి|| ౧౩

కం|| ధరచామర్లను సత్పుర
వరమున శ్రీసంగమేశ వరనామమునన్
దిరముగ వెలశితి నీవును
గరమొప్పగ నందు జేరుగరిమవహిల్లన్|| ౧౪

5


కం|| అనియిట్లద్రుశ్యుడయినను
దనవారలకెల్ల నెరుగదయనింపారన్
వినుపించి వారియనుమతి
పనుపడ పరమేశుకృపను ప్రౌఢతనుండెన్|| ౧౫

తే.గీ|| వేంకడాద్రికి పుత్రుండు విమలమతియు
సరసుడౌదార్య వితరణసాహసుండు
పరగస్వగ్రామ పెత్తనపరిధవుండు
సూరయాఘ్యుండు నాశ్రితసుజనహితుడు|| ౧౬

కం|| శ్రీకర సుకుమారుండును
ప్రాకట మణిభూషణాది బహుళాంగధరుం
డౌకామితార్ధచిత్తుడు
సాకల్యసుభాతిశయుడు సచరితుడెలమిన్|| ౧౭

తే.గీ|| పన్నుగానొప్పుమిగుల సూరన్నగారి
కరయపుత్రులు నేడ్గురు నందముగను
నమరి సప్తమహషున్ లయట్ల బ్రబలి
కీర్తిలలరార దురితనివర్తు లగుచు|| ౧౮

సీ|| శ్రీలలరారగా గ్రాలువిఖ్యాతిచే
నొప్పునుమహిని నప్పన్నగారు
సతతంబు సద్ధర్మ సరణిచే పొగడొంద
పన్నుగా వెలసె శంభన్న గారు
గరుణాంతరంగ సంకలితుడై బ్రీతిచే
నెన్నగా రహిని కొండన్నగారు
యెసగునౌదార్యాది రసికుడై జనులెల్ల
క్రన్నన పెద్ద వెంకన్నగారు

తే.గీ||చెన్నుమీరగ ఘనుడు ముత్తన్నగారు
సన్నుతులగాంచె జగతి సీతన్నగారు
చిన్నదనమున చిన్న వెంకన్న గారు
విశదమైనట్టి కీతున్ వెలశె మహిని|| ౧౯

6


సీ|| అగ్రజు డప్పన్న యవనీతలంబున
ధన్మాభివృద్ధిగాదనరె భువిని
నాశిగాచనుదెంచు భూసురోత్తములకు
నొసగెమాన్యాదుల నెసగుమతిని
ఆరామకూప మహత్వాది దేవతా
మందిరంబులను సమ్మతినెసంగ
జేయించి పరతత్వదాయియై సతతంబు
గ్రామాధికార సుధాముడగుచు

తే.గీ|| సంగమేశ్వర వరలబ్ధ సహితుడగుచు
చెలగి సద్గుణ సత్యసుశీలుడగుచు
మహిని స్వారాజ్య రాజసన్మాను డగుచు
వెలశె ధరణీతలంబున విమలుడగుచు|| ౨౦

సీ|| బహుపురాణ శ్రవణ పారీణ సంభ్రమ
స్వాంతానుభవుడు ప్రశాంత మూతిన్
సాధుగోష్ఠీవిలాసాదుల నిరతంబు
బ్రహ్మానుభవమున ప్రబలు మూతిన్
విశదంబుగా షోడశమహాదానాది
వితరణ కరుడు సద్విదితయశుడు
సత్యసదాచార సద్ధర్మ నిరతుండు
హృదయ రంజనుండు సదయకరుడు

తే.గీ|| ధరనుచెలగుచు నర్ధిమందారుడగుచు
స్వపురమునందున నధికారసరణిధర్మ
పద్ధతిని బ్రోచుచుండి విశుద్ధవంశ
వృద్ధినెసగగజేసె సమృద్ధిగాను|| ౨౧

7


సీ|| అంతనప్పన్నకు నతికౌతుకముమీర
పుత్రషట్కముగల్గె ముదముమీర
సరసుడౌదార్యాతిశయములవెలసెను
నెయ్యమొప్పగను పుట్టయ్యగారు
విపుల ధర్మాధర్మ వేదియై రహిమించు
చయ్యనఘనుడు సుబ్బయ్యగారు
విభనాదుల మరసద్వినుతిచే సత్కీతిన్
మన్ననగాంచె నయ్యన్న గారు
వినయవివేకుడై మనియె సంతతమును
పన్నుగా జగతి వెంకన్నగారు

తే.గీ|| క్రమత ధర్మార్ధ కామమోక్షములయందు
పిన్నపెత్తనములను సంగన్నగారు
విగత భవమాననీయుడై విశదముగను
సన్నతింపగ వెలశె సూరన్నగారు|| ౨౨

సీ|| హర్షిన్ తు డప్పన్న నయిదవపుత్రుండు
గరిమచేవెలశె సంగన్నగారు
విరివిగా వాశిరెడ్వేంకటాద్రీనాయు
డవని మల్రాజు గుండ్రావుగారు
వరలు మాణికరావు భావనారాయణ
రావు మానూరు నర్స్రావుగారు
మొదలు జమీన్ దార్ల ముందట కోటము
రాజు వెంకాఖ్యవిభ్రాజితుండు

తే.గీ|| రంజిలంగను మిగుల దినాంజిహోద
వసుధ చామలన్ పురము నివాసముగను
వెలసె గావునపయివారు జెలగునట్లు
సలుపుచుండెను సరఫరా సరసముగను|| ౨౩

8


తే.గీ|| ఆజమీదార్లననుమతి నతిముదమున
రహినిమాణిక్యరావు నారాయణుండు
స్పష్టముగ సంగయాఖ్యుని నిష్టకపుడు
మెచ్చి భూమిని కొంతదామిచ్చె బ్రీతి|| ౨౪

తే.గీ|| అవనికోటమురాజు కులాబ్ధిసోము
డయిన యావెంకుపంతుల నతిసహాయ
మమర శ్రీసంగమేశ్వరానుగ్రహమున
జగతి సత్కీతిన్ సాధించె సంతతంబు|| ౨౫

క|| శ్రీసంగమేశుకృపచే
భాసిల్లుచు ధర్మకర్త భారము గనితా
వాసిగ నౌకర్లకువెస
భూసురు లౌననగ నొసగె భువిమాన్యంబుల్|| ౨౬

తే.గీ|| యుర్విశ్రీ పన్కునూళ్ళ గోత్రోధ్భవశ్య
నలరుసంగన్న నామధేయస్యసహకు
టుంబఘనతర సపరివారంబుగాను
నెలమినీరీతి భూసురాదులు వచింప|| ౨౭

సీ|| బ్రత్యహంబునును మాపతినిహృత్పుండరీ
కమునందు నిల్పి నిక్కముగ మరియు
గోపురప్రాకార మేపారసత్ప్రద
క్షిణము సల్పుచును వేడ్కలను మిగుల
దగసంగమేశు సందర్శనంబును జేసి
బాడబవరులచే బ్రమదమునను
వనరంగమంత్రపుష్పాదికవిధులచే
యెసగుపూజలను జేయించిమిగుల

తే.గీ|| గృహమునందును నిరతంబు గొనబుమీర
యింద్రవైభవమున సత్యసంధుడగుచు
నతిధిభూసురవరుల సమ్మతులుగాను
జేశి మందారవిధమున వాసిగాంచె|| ౨౮

9


కం|| అతిముదము నిష్టవేల్పని
బ్రతివత్సరమునను వుతవాదివిధంబుల్
మితిలేక సల్పుచుండెను
చతురిండిత డౌరయనగ జగతిన్ వెలసెన్|| ౨౯

తే.గీ|| అంతసంగన్నగారికి సంతసమున
సుతులునల్వురు వరుసగా సుదతిమణియు
లలితసద్గుణ నికురంబలక్ష్మమాంబ
నొనరగానొప్పె యీశ్వరానుగ్రహమున|| ౩౦

కం||ఘనుడు నరసాభిదాహ్యయు
డనబరగిన భావయాఖ్యుడనగను పిదపన్
వినయుడగు సీత యాహ్వయు
డనధరలో లింగయాఖ్యుడనగా వెలసెన్|| ౩౧

కం||సరసుడు నరసాహ్వయుడిల
వరసద్గుణములను వంశవర్ధనుడగుచున్
దిరమొప్పగ్రామపెత్తన
మరయవహిల్లంగ బ్రోచెనతినెయ్యమునన్|| ౩౨

తే.గీ|| భావయాఖ్యుండు మిగుల సంభ్రమపరుండు
కలితసుజ్ఞాన వంతుడుకలుష హరుడు
బమరచారిత్రు డార్యసంపత్కరుండు
మాననీయుడు రాజసన్మానయుతుడు|| ౩౩

10


ఆ.వె|| సీత యాఖ్యయుండు బ్రీతివిఖ్యాతిచే
ఖచితహర్మ్యగేహ నిచయములను
చిత్రముగను నంతచేయించి వేడ్కచే
బరమహర్షుడగుచు ప్రబలుచుండె|| ౩౪

కం|| ధరలింగాఖ్యుడు ధర్మము
సరసమతిన్ పాలనంబు సల్పుచును వెసన్
గురుభక్తిని వ్రతమేర్పడ
గరుణాన్వితలోలుడగుచు ఘనతరమతినిన్|| ౩౫

కం|| వారిలొనర సభిధానున
కారయతనయులును లేక నటలింగాఖ్యకు
మారుని మూలాహ్వయుగొనె
భూరిశుభావహుని దత్తపుత్రునిగాగన్|| ౩౬

కం|| చతురుడు మూలాహ్వయునకు
నతిసుగుణుడు వేంకటప్పయాఖ్యయుడమరున్
సతతము భగవధ్యానము
లతులితముగ జేయు సుతుడునంత జనించెన్|| ౩౭

సీ|| భావయాఖ్యునకంత బరమసంతసమున
సుతపంచకంబును సొరదిగల్గె
శీతాభిధాను సత్ప్రీతి బుచ్చాహ్వయు
డగుజగ్గయాఖ్యయుడమరుసంగ
యాహ్వయుడలరు పట్టాభిధానత నెన్న
నందగ్రజుడు శీతయాహ్వయునకు
సుతులు లేకున్నంత గతులికపుత్రస్య
గతినాస్తియని తనమతినిదెలసి

తే.గీ|| ప్రాభవముగాను వేడ్క జగ్గభిదాన
వరుని తనయుని సకలసద్వైభవమున
ఘనతమీరంగ తగుదత్త తనయునిగను
శ్రేయముగగాంచె శ్రీసుబ్బరాయవరుని|| ౩౮

11

కం|| హెచ్చగు భగవత్పూజల
బుచ్చాహ్వయుకిరువురొప్పె పుత్రులు జగతిన్
అచ్చుగ గోపాలాఖ్యుడు
గ్రచ్చర శ్రీరామ కృష్ణఘనవరులెలమిన్|| ౩౯

కం|| సంగాంహ్వయునకు జగతిన
భంగవరుల్ నాత్మజులును పరమప్రీతిన్
రంగుగ గల్గిరి నలుగురు
మంగళకరుల వనిబరగె మహితనిరూఢిన్|| ౪౦

తే.గీ|| గరిమ వేంకట కృష్ణాఖ్య ఘనుడుపిదప
బరగు శివలింగయాఖ్యసంపద్గుణుండు
సూరనారాయుడార యధిరవరుడు
భావయాహ్వయుడౌనన బ్రమదమునను|| ౪౧

కం|| వేంకట కృష్ణాహ్వయునకు
పొంకముగ సుతద్వయంబు బొల్పువహిల్లన్
వేంకట్రామాఖ్యయుసం
గాఖ్యయులన నొప్పెమిగుల నవనీస్తలిపై|| ౪౨

కం|| ధరపట్టా హ్వయునకువెస
నరయగనైద్గురును మించెనతిశయవరుసన్
గురుభక్తులు కులభూషణు
లరిసూదనవరులు దారులార్య విధేయుల్|| ౪౩

ఆ.వె|| భావయాఖ్యయుండు బరగు ముకుందరా
యాహ్వరామస్వామి యెసగు వేంక
టప్పయాఖ్యసాంబ యాఖ్యులనగమించె
విపులధర్మపరులు విమలమతులు|| ౪౪

12


సీ|| ఖ్యాతిమీరినయట్టి సీతయాహ్వయునికి
నరయసంతతిలేక నతిముదమున
కరమొప్ప భావాఖ్యుకడుతృతీయ సుపుత్రు
జగ్గయాహ్వయుని హ్రుత్సరసమంద
శుభలగ్నమందున సొంపుగాగొనితెచ్చి
దత్తుగాబెనుచుచు దనరెమిగుల
జగ్గయాఖ్యునకంత జనియించి రబ్జజు
హరిహరాదులమాడ్కి గరిమసుతులు

తే.గీ|| మానితముగాను నరసాభిధానరసిక
వరునిశ్రీసుబ్బరాయసద్వంశ మణిని
సరసనైపుణముల రామస్వామియనగ
వెలసె సుజ్ఞానవంతులై వినుతిమీర|| ౪౫

కం|| నాసిగలింగాఖ్యునికిని
ధీసద్గుణులిరువురెలమి దెరమొప్పంగన్
భాసితుడగు మూలాఖ్యుడు
భాసురమతిసంగయాఖ్య భవ్యుండెలమిన్|| ౪౬

గోపాలరావు గారి వంశము

కం|| గోపాలాఖ్యునికినిదగ
ప్రాపుగ కన్యాద్వయంబు బ్రభవించిరిలం
నాపుణ్యవతులు చెలగిరి
సాఫల్య తరంగమాంబజనుకప్పాంబల్|| ౫౭

సీ|| అందునగ్రజరంగమాంబ యందున సుతుల్
నిరువురలోపల నెసగెవహిని
పరగెనుమిగుల జంపాలను వేంకట
గోపాలరాయతనేపుమీర
రహికొత్తగోపాల రాయునికినిదగ
దౌహిత్రబాధ్యతనదనరెమిగుల
యిలను శ్రీహరిహరాదుల సమబుద్ధిచే
సతతంబు మతిభక్తి వితతులందు

తే.గీ|| మాన్యచారిత్రుడై యొప్పెమహితసద్గు
ణాదులను వేడ్కమీరనామోదమునను
నర్ధిజనకల్పకుండిత డౌరయనగ
సాంద్రకీర్తుల వెలసెను సరణిగాను|| ౪౮

13


సీ|| సంగమేశ్వరుని హృత్సరసీజముననిల్పి
గరిమసన్నుతిజేయు కమ్మవారు
సంగమేశ్వరునిమేల్ సత్పూజ నిరతంబు
కడుముదమునగాంచు కమ్మవారు
సంగమేశ్వరు సదాసధ్యానమనసుతో
ఘనపరార్ధతగాంచు కమ్మవారు
సంగమేశ్వరు కటాక్షమున మహానంద
కరవైభవముచేత కమ్మవారు

తే.గీ|| ఖలవిగతులార్య పాలకుల్ కమ్మవారు
కలితవర సద్గుణాంగకుల్ కమ్మవారు
క్రమతనౌదార్య రసికులు కమ్మవారు
కవిజనార్ధి సురద్రుముల్ కమ్మవారు|| ౪౯

14

పుట్టయ్య గారి వంశము

సీ|| అగ్రజుడగు పుట్టయాఖ్యయునకు సుతుల్
జ్యేష్టుండు సంగన్న జెలగె నవని
సుందయాఖ్యయుడన సురుచిరంబుగగల్గె
సంగయాహ్వయునకు సంతసమున
నుదయించెపుత్రుండు నొనరయప్పాహ్వయు
డతని జనియించె సుతులుముగ్గు
రందునగ్రజుడమరె నందంబుగాకోట
యాఖ్యుండు లింగాఖ్యుడలరెపిదప

తే.గీ|| సొంపుమీరగ వేంకట సుబ్బయాఖ్యు
డంతసుందాహ్వయునకు ప్రశాంతుడనగ
కోటయాఖ్యుండుజనియించె నాటముగను
పరమధర్మాత్ములీశ్వర ప్రార్ధనముల|| ౫౦

సుబ్బన్నగారి వంశము

తే.గీ|| భువినియప్పన్న రెండవ పుత్రుడైన
సుబ్బయాఖ్యునికంతట సురుచిరముగ
సుతులుముగ్గురు నుదయించె సొంపుగాను
రహినిజగ్గాఖ్య కిచ్చాఖ్యరామవరులు|| ౫౧

తే.గీ|| అగ్రజుడు జగ్గయాఖ్యునకమరె మిగుల
సంతతంబున పుత్రుండు సరసుడనగ
బరమహర్షాత్ముడౌలక్ష్మి నరసయాఖ్యు
డవనిశ్రేయోభివృద్ధిగా సవినయమున|| ౫౨

సీ|| యేమహనియ్యుని బ్రేమాతిశయమున
భూసురప్రకరంబు వాశిగాంచె
యేవీరవరుపెరభూవలయంబున
భూదాన శాస నామోదమయ్యె
యేమాన్యసుచరిత్రుకోమలమృదువాక్య
పద్ధతిధర్మంబు పరిఢవించె
యేకీతిన్ సాంద్రుని ప్రాకటమహిమల
దివిరియానందాబ్ధిదేలుచుండు

తే.గీ|| అతడునిరతాన్న విధఘనత్యాగనీతి
హర్ష ములచేత యైశ్వర్యహర్షుడగుచు
వెలశెకడువేడ్కశుభముల జెఱగుచుండె
సౌఖ్యయుతుడౌర శ్రీకిచ్చయాఖ్యవరుడు|| ౫౩

15

తే.గీ|| కిచ్చయాఖ్యునిపుత్రులు హెచ్చుగాను
నలుగురుదయించె వారిలో నగ్రజుండు
రహిని సుబ్బాఖ్య వెంకటరాయమణియు
హర్షమున జగ్గయాఖ్యుండు హనుమయాఖ్యు
డనగపొగడొందె కీతున్ లనతిశయమున|| ౫౪

తే.గీ|| సుబ్బయాఖ్యునికిరువురు సుతులుగల్గె
రహినియప్పాఖ్య వెంకటరత్నయాఖ్యు
లగ్రజుడు యప్పయాఖ్యున కమరెసుతులు
నిరువురెలమిని ధరణిపైగురుతరమున|| ౫౫

తే.గీ|| ఘనుడు వేంకటరత్నాఖ్యతనయవరులు
నిర్మలాత్ములు రసికులు ధర్మవరులు
యార్యపూజితులతి శౌర్యధుర్యులగుచు
ముఖ్యముగ బుచ్చయాఖ్య సుబ్బాఖ్యులమరె|| ౫౬

తే.గీ|| దనరువేంకటరాయుని తనయవరులు
నలుగురేర్పడె ముదముచే సలలితముగ
నరసయాఖ్యుడు రామాఖ్యుడరివిజితులు
నవనిక్రిష్టాఖ్యయుడు సంగయాఖ్యయుండు|| ౫౭

తే.గీ|| క్రిష్టయాఖ్యున కేర్పడ స్పష్టముగను
సురుచిరంబుగ వేంకటసుబ్బయాఖ్యు
డమరె గాంభీర్య విపులవిఖ్యాతిమీర
సంతసంబున శివపదస్వాంతుడగుచు|| ౫౮

16

తే.గీ|| గంహ్వరంబున జగతి జగ్గాహ్వయునకు
పరమపావన సద్ధర్మపరిఢవమున
ధాత్రిపొగడొందె వరుససుతత్రయమును
మోదమలరారకీర్తుల నాదరమున|| ౫౯

తే.గీ||హనుమయాఖ్యుని తనయులునమరనల్గు
రరయనగ్రజుడనగను నతిశయిల్లె
లలితగుణముల సీతరామాఖ్యలక్ష్మి
యాఖ్యవేంకటరమణ సంగాఖ్యులనగ|| ౬౦

అయ్యన్నగారి వంశము

సీ|| యేఘనాంగుని శుభదాఘనస్ఫూతిన్ చే
పుడమికల్పకవిధస్ఫూతిన్ గల్గె
యేదయాగుణుని సమ్మోదావలోకన
పుడమిసరస్వతీ స్ఫూతిన్ గల్గె
యేధర్మనిరతుని సాధువాదములచే
పుడమి బ్రంహ్మ న్భవస్ఫూతిన్ గల్గె
యేపరాక్రమగణ్యు నాపరాక్రమముచే
పుడమి హేమాద్రి విస్ఫూతిన్ గల్గె

తే.గీ|| ననఘుడౌదార్య విద్యవేదాంతధైర్య
వితతులను సాటిలేరనవిపులధర్మ
పాలనంబున జగతిపైప్రబలెనౌర
ముఖ్యముగ వేడ్కతానయ్యనాఘ్యుడనగ|| ౬౧

సీ|| భువినప్పయాఖ్యు మూడవపుత్రుడయ్యనా
హ్వయునకు సుతులొప్పునైదుగురును
అగ్రజుండనగను నలరెజానకిరామ
వరుడు కొండాఖ్యయుడరిజితుండు
పొంకంబుగా నొప్పు వెంకటాఖ్యుండన
సుగుణవంతుండైన సుబ్బయాఖ్యు
డలరుసంపదలచే శినాఖ్యుండు
జానకిరామ సుజ్ఞానవరుని

తే.గీ|| కరయపుత్రులుముగ్గురు నతిముదమున
వీరయాఖ్యుండువిపుల సద్విమలగుణుడు
గంహ్వరంబుగవెలశె శీతాంహ్వయుండు
లక్ష్మయాఖ్యుండు మహిని సలక్షణముగ|| ౬౨

17

తే.గీ|| వీరయాఖ్యయుడంతట విమలమతిని
లక్ష్మయాఖ్యతనూజుని లలితముగను
యుత్తమముమీరగొనెవేట్క దత్తుగాను
ముఖ్యమౌనట్టుగా రామయాఖ్యవరుని|| ౬౩

తే.గీ|| సీతయాంహ్వయునకు సుతుల్ క్షితినిలేక
లక్ష్మయాంహ్వయు పుత్రునిలలితముగను
సుబ్బయాఖ్యునిదత్తుగా సుఖముగాను
సుతునిగాదెచ్చి పెనచెను సురుచిరముగ|| ౬౪

కం|| ధరలక్ష్మయాఖ్యునకు వెస
గర మొప్పగ నల్గురొప్పె గడునెయ్యమునన్
గురుభక్తి మానసాత్ములు
ఖలవిగతులు సుగుణవరులు ఘనసంభ్రములన్ || ౬౫

తే.గీ|| క్రిష్ణయాఖ్యుండు జగతిపైనిష్టపరుడు
సుబ్బయాఖ్యుండునాశ్రిత సుజనహితుడు
సరసనైపుణముల రామస్వామియనగ
అప్పయాంహ్వయుడెలమి దానొప్పెమిగుల|| ౬౬

కం|| కొండాంహ్వయునకు పుత్రులు
భండన విక్రములు ధర్మపాలనులై భూ
మండలమున సత్కీర్తుడు
ఖండమతిన్ హనుమయాఖ్యఘనబుచ్చాఖ్యుల్|| ౬౭

18

తే.గీ|| అగ్రజుడు హనుమయాఖ్యునకంతగల్గె
నమరనయ్యాంహ్వయుండన నప్పమాంబ
గర్భ శుక్తిమరత్నంబు ఘనతగాంచె
భువినిజంపాలవంశాబ్ధి పూర్ణచంద్రు
డై వెలింగెను వెంకాఖ్యుడతిశయమున|| ౬౮

తే.గీ|| వెంకయాఖ్యయుపుత్రులు విమలమతులు
సిరులచే హనుమయాఖ్యుండు శ్రీకరముగ
చన్నయాఖ్యుండు సంభ్రమసన్నుతుండు
రామయాఖ్యయులనగను రహిచెలంగె|| ౬౯

తే.గీ|| దనరు శ్రీరామవరుని సుతద్వయంబు
నగ్రజుడువెంకయాంహ్వయుడలరెమిగుల
సుగుణకరుడైన వేంకటసుబ్బయాఖ్యు
డనగసత్కీతిన్ సాంద్రులై జనములలర|| ౭౦

కం|| యిలసుబ్బాఖ్యునిసుతయగు
సలలితముగ సీతమాంబ సత్పుత్రుడుచె
న్నలరార దేవభక్తిని
కులశీలుడు రామచంద్రుడలరారెవెసన్|| ౭౧

19

వెంకన్నగారి వంశము

సీ|| యవనిచేధర్మంబు లేర్పడజగతిపై
క్రమముగా నాల్గుపాదముల బరగె
యవనిచేనద్భుతంబెసగంగ సత్యత
రహిని గ్రామాధికారము వహించె
యవనిచేగ్రంధాదులేర్పడ లిఖితముల్
వెసబఠించుటకునై వెలసెమిగుల
యవనిచేభూదాన మవనిననేకముల్
భూసురాదులకు నేర్పుగనుగల్గె

తే.గీ|| నతడుమతిమంతు డతిశాంతుడనఘవంతు
డాశ్రితస్వాంతుడౌదార్యుడమిత ధైర్యు
డాదియౌసద్గుణాదుల నమరెభువిని
మన్ననవహిల్ల వెలశెవెంకన్నగారు|| ౭౨

తే.గీ|| వెంకయాంహ్వయునకు సుతుల్ పొంకముగను
నల్వురుదయించె వేట్కచే సలలితముగ
ప్రబలతర సద్గుణాంగులై బరగెనౌర
హరపరాయత్త చిత్తత నతిశయిల్లు|| ౭౩

తే.గీ|| పుడమిరఘయాఖ్యు డనగను బొలుపుమీర
చలమయాఖ్యుండు ననఘుండు సలలితుండు
ఆశయాఘ్యుండు మహిమలనాశిగాంచె
సౌఖ్యుడైదాను శివలింగయాఖ్యుడొప్పె|| ౭౪

కం|| వారలుసంతతనిర్మలు
లారయగురుభక్తి మానసాత్ములువరుసన్
ధీరతరసత్యవాక్యులు
భూరిశుభావహులు హర్షమోదకు లెలమిన్|| ౭౫

తే.గీ|| దనరరఘయాఖ్యునకు సుతుండనగనొప్పె
పొందుగను వెంకయాఖ్యుండునందముగను
నంతనాయనకును సుతుల్ సంతసమున
ముగ్గురుదయించెకీతున్ ల ముదము మీర|| ౭౬

20

తే.గీ|| యెనగె వెంకట క్రిష్ణాఖ్యుడసదృశుండు
ధీరితరనైపుణములచే సారసముగ
విపులసంభ్రమపరతను వెలసె మిగుల
మహితఘనముల నలరాల మహిని రహిని|| ౭౭

తే.గీ|| నమరుస గాంహ్వయుడు మహానందపరుడు
ప్రబలతరకీర్తనీయుండు పరమగుణుడు
కలుషదూరుండు నాశ్రితకల్పకుండు
సవినయుండన వెలసెదాభువినిమిగుల|| ౭౮

ఆ.వె|| పారుమార్ధికుండు పరమసుజ్ఞానుండు
కలిత సద్గుణాంగకరుడు మహిని
చతురవాక్యయుండు సద్ధర్మశీలుండు
రఘయనామకుండు నఘహరుండు|| ౭౯

తే.గీ|| అలరుచలమాఖ్యయునిసుతుల్ నైదుగురును
సొంపుగను వెంకయాఖ్యుండు సూరయాఖ్య
రామయాఖ్యయులనగను శ్రీశివాఖ్య
క్రిష్ణయాఖ్యయులీశ్వరనైష్టికులును|| ౮౦

తే.గీ|| అగ్రజుడు వెంకయాఖ్యుని కంతసుతులు
గల్గకున్నంత దత్తునిగానుదలచి
రామయాఖ్యునిపుత్రునిరహిజెలంగ
మూలయాంహ్వయుబెనచెను ముదముమీర|| ౮౧

కం|| ధరరామాఖ్యుడుధర్మము
సరసమతిన్ పాలనంబుసల్పుచునుయిలన్
దిరమొప్పనిరతమేర్పడ
గురుపూజాధుర్యుడగుచు కొమరారెవడిన్|| ౮౨

కం|| వరరామాఖ్యునితనయులు
నిరువురునగ్రజుడనంగ నేర్పరియగుచున్
సరసుడగు యప్పయాఖ్యుడు
గరుణామతిమూలయాఖ్యఘనులంతవెసన్|| ౮౩

21




పంతమునసంగయాఖ్యయు
డెంతో మోదంబుమీర నెసగెనుధరపై|| ౮౪

తే.గీ|| ఆశయాంహ్వయునకు సుతుల్ వాశిగాను
సాటికారనజనియించె కోటయాఖ్య
సంగయాఖ్యుండు భక్త ప్రసంగ మతులు
వైభవంబున నెసగిరివరుసగాను|| ౮౫

కం|| శివలింగాఖ్యయునకు వెస
బ్రవిమలతసుతుండుగల్గె బ్రేమలరంగా
భువికోటాఖ్యుండనగను
నవిరళమతిమూలయాఖ్యు డతనికిగల్గెన్|| ౮౬

సూరన్న గారి వంశము

కం|| గరమొప్ప యప్పయాఖ్యున
కరయగపుత్రులును రవవారల్
గురుభక్తుడుసూరన్నకు
సరసుడు శివయాఖ్యుడొప్పె సంతసమందన్|| ౮౭

తే.గీ|| సొరదిశివయాఖ్యుడేర్పడె సుతులునల్గు
రందునగ్రజుడలరె నింపొందగాను
సత్యవాక్యుండు సజ్జనసమ్మతుండు
గురుతరానందు డైశ్వర్యకరుడనంగ|| ౮౮

తే.గీ||మంగళప్రదుడగునట్టి లింగయాఖ్య
క్రిష్టయాఖ్యయుడన బహునైష్టికుండు
సోముడై కడుప్రబలె శ్రీరామయాఖ్యు
డెలమివెంకాఖ్యులేర్పడెయిలను రహిని|| ౮౯

22







తే.గీ|| రాజయాఖ్యయుతనయులు తేజముగను
ముగ్గురేర్పడగలిగిరి మోదమలర
ఘనతమీరంగ కీతున్ లగాంచిమహిని
బరగెసుగుణాతిశయముల బ్రౌఢిమీర|| ౯౭

తే.గీ|| కీతున్ లనునగ్రజుండొప్పె క్రిష్టయాఖ్య
రామలింగాంహ్వయుడును విరాజితముగ
కోటయాఖ్యుండు వరసగాగొనబుమీర
యీశ్వరధ్యానపరులయ్యు నెసగిరెలమి|| ౯౮

తే.గీ|| క్రిష్టయాఖ్యుని పుత్రులు స్పష్టముగను
ముగ్గురలరారె నాత్మనుమోదమంద
ఘనునయారామలింగాఖ్య ఘనునకంత
ధాత్రిపొగడొందె వెసను సుతద్వయంబు|| ౯౯

తే.గీ|| సుబ్బయాఖ్యుండు వివిధ సంస్తుతయశుండు
రాజయాఖ్యుండు సద్వాక్యరాజితుండు
సంబ్రమంబులబ్రబలిరి సరసముగను
సుతులునిద్దరు కోటాఖ్యయుతునకెలమి|| ౧౦౦

శ్రీ గురుస్తుతి

సీ|| వసుధలో గుదిమెండ్ల వంశాబ్ధిసోముడై
బరగురంగాచార్యప్రాభవుండు
వారికినాత్మజుండారయ వేట్కచే
సరసుడావేంకటాచార్యులనగ||




తే.గీ|| గ్రామసద్గుణములను సుశీలుడగుచు
గౌరవంబునభరిత నిష్కాముడగుచు
బరమ వేదాంత తాత్పర్యప్రౌఢుడగుచు
సరసశారద వరలబ్ధసహితుడగుచు|| ౧౦౧

తే.గీ|| అట్టిగురువర్యవరులను నమరవేట్క
భువిని సంగమ చామర్లపురిని వెలయు
కమ్మవారలు హృత్పద్మకమలములను
దలచిసతతంబు గొలుతురు జెలగినటుల|| ౧౦౨
కం|| విమలముగా వంశాను
క్రమణికమను వర్ణణంబు కడువేడ్కవహిం
ప్రమదమున సంగమేశుని
కమర సమర్పించె మిగుల నలరంగ వెసన్|| ౧౦౩

కం|| ఆశుకవిత్వము జెప్పితి
వాశిగకవివర్యులెల్ల వహినేర్పడగన్
ధీసమబుద్ధిని తప్పులు
భాసిల్లగ దిద్దరయ్య పండితులారా|| ౧౦౪

కం|| క్షమవడ్డమాని వేంకట
రమణాఖ్య కవీంద్రవరుడు రంజిల జేసెన్
క్రమమొప్ప వినిన చదివిన
సమలతసంతాన నాయురారోగ్యములన్|| ౧౦౫
.............................................

కధావింశతి - రచన: పండిత కొత్త సత్యనారాయణ చౌదరి

ఆంధ్ర దేశములో గుంటూరుమండలమం దొక సుప్రసిద్ధ గ్రామమున నొక కృషీవలుఁడు ఉండెను. ఆతడు సర్వ ధర్మములు తెలిసినవాడు. పౌరాణిక గాధలన్న మిక్కిలి ప్రీతి కలవాడు. తనకు గల దానిలోఁ బేదసాదల కింత నిచ్చుచు, ప్రాజ్ఞులను గారవించుచుఁగాలము గడుపుచుండెను.
పని పాటలు గల రోజులలోఁ దన పొలమునకుఁ బోయి కూలివాండ్రతోఁ దానును గష్టపడి సేద్యము సాగించుచు, వలసిన దానిని గడించుకొనుచు స్వతంత్ర జీవనము చేయుట యాతనికి సహజము. తానొకరి కే రూపముగనైన నిచ్చుటయే గాని ‘దేహి’ యని పరులయొద్దం దిరిప మెత్తుకొనువాఁడు కాఁడు. పరోపకారము మూలమునను, భూతబలి యొసఁగుట వలనను నాతఁ డంతయో యింతయోసుకృతము గడించు కొనుచుండెను.
ఒకప్పుడు వరిపొల మంతయు బండఁ బాఱి యుండి కనుపండువు చేయుచుండెను. కృషీవలు లెల్లరు తమ తమ పొలము పనులకయి తొందర పడసాగిరి. విత్తనములు కొందఱు చల్లుచుండిరి. కోఁతలు కొందరు పట్టసాగిరి.
మన కృషీవలుఁడును, జాగరూకత కలిగి, యదను దప్పకుండ పొలముపని చూచుకొనుచుండెను. అతని పొలమునకును నాతని గ్రామమునకును నడుమ నొక యేరు కలదు. అది యారోజులలో మిక్కిలి విచిత్రముగఁ బొంగి పొరలుచుఁ బ్రవహింప సాగెను. పొలములకుఁ బోవు వారందఱకు సంగడి మాత్రము సాధనముగ నుండెను.
అది యమావాస్య.అంద ఱెడతెగని పనులయందుండిరి. పొలమునం దెక్కడఁ చూచినను మనుష్యులె. తరుణము మించిపోవునని త్వరపడుట కృషీవలులకు నైజము. ప్రొద్దుగ్రుంకినది. కూలి నాలి జనము పొలముల నుండి వెడలను గాఢాంధకార మంతటఁ గ్రమ్ముకొనెను.
ఆ ప్రజ లందఱు ఆ యేటి యొడ్డునకుఁ జేరిరి. అలసి సొలసి యుండుటఁ జేసి త్వరితముగ నిండ్లకుఁ బోవలయునని యందఱు నుబలాట పడుచుండిరి. కాని, యేరు దాఁట వలయుఁగదా! ఒకేతూరి హెచ్చుమంది దాఁటుట కా చిన్న సాధనము వీలుపడదు. అయినను, తొందఱనుబట్టి ప్రయాణమును మించునట్లు, పెక్కుమంది సంగడి నెక్కిరి. అందుఁ బిల్లలు గలరు. పెద్దలు కలరు. ముదుసలులు గలరు. చూలాండ్రు కలరు. యువకులమాట చెప్పఁబనిలేదు. ప్రవాహ వేగమునకు గూడ మితియు మేరలేకుండెను.
ఆ చిమ్మ చీఁకటిలో సంగడి బయలు వెడలెను. నడుమకుఁ బోవుసరికి భారము మీరిపోవుటఁ జేసి సంగడి మునింగెను. గొల్లుమని గోల వెడలెను. జనమంతయు నీటఁబడెను. ఎక్కడివారక్కడ. ఎవరిగతివారిది. ఒకరికొకరు కన్పించు భాగ్యమేలేదు. అట్టి యాపత్తులో - ఒక్క ధీరుడు - అందున్నవాడె, నీటినుండి తెప్పరిల్లి యందినవారి నెల్లరను నొక్కుమ్మడిని, జుట్టుపట్టుకొని, కాలుసేతులు పట్టుకొని వీలగు తీరుగ నొడ్డునకుఁ జేర్చివైచెను. ఒడ్డునకుఁ జేరి కొందఱు ఒడలు మఱచియుండిరి. కొందఱు తెప్పరించుకొనిరి. అందఱు చేరిరి గదా యని యానందముతో - ఆధీరుడు చలిచే నొడలు వడఁకుచున్నను, నాఁటి యమావాస్య యుపవాసము మూలమునఁ, బొలములోఁ బని జేసి యుండుట వలన అలసి సొలసి పోవుటఁ జేసి యాఁకలి చిచ్చు తీవ్రముగ దహించుచున్నను, లక్ష్యపెట్టక పంచలు పిండుకొనుచుండెను.
అంతలో నచ్చటికి దిగువనుండి ‘బాబూ,ననుగూడ నొడ్డుచేర్పవా! రక్షింపవా! అని యాక్రందనము వినఁబడియె. ఆ ధీరుండది విని ‘అయ్యో ! యింక నొక్కడు మిగిలియుండెనా! యని తలంచి సంశయింపక గుభాలున నీటదుమికి రివ్వున నీఁదుకొంచు వాని కడకు బోయెను. ఒడ్డుపొడుగునందు, బలమునందు నాతడు ధీరుని మించిన వాఁడేకాని యాపదలోఁ జిక్కినాడు. కావున వెంటనే వాఁడు వెనుకకు దిరిగి, ఆర్తత్రాణపరాయణుఁడగు ఆధీరుని మెడను బెనవైచి పట్టుకొనెను. ఆ ధీరుఁడు సొమ్మసిలి యున్నవాఁడగుటను, ఎదుటివాఁ డాకస్మికముగ మీదఁ బడుటవలనను దెప్పరించుకొనలేఁడయ్యెను. ఎంతో పెనఁగులాడెను. లాభము లేకపోయె. ఇరువురు చుట్టఁబెట్టుకొని ప్రవాహ వేగమునఁ గొట్టుకొని పోవుచుండిరి.
అటకు దాదాపుగా, నేటినుండి మఱొక కాలువకుఁగొన్ని తూములు కలవు. అట నీరు సుడివడుచు నగాధమయి భయంకరముగ నుండును. వా రిరువు రా వేగమునఁ బడి తూములలోఁ జిక్కుకొనిరి. తెల్లవారు సరికి - ఆ యార్తుడు తూములోఁ జిక్కియుండుట, ఆ ధీరుఁడు కాలువ వెంటఁగొట్టుకొనిపోయి యొక్కెడ నుండుట గ్రామవాసు లందఱు కాంచిరి. ఆ ధీరపురుషుని వీరకృత్యమునకు రిచ్చవడనివారును, గంటఁ దడిపెట్టనివారును ఊరిలో నొక్కరును లేరు.
ఆ ధీరపురుషుఁ డెవ్వరో తెలియునా? మన కధానాయకుఁడగు కృషీవలుడే యా వీరుడు. స్వార్ధము చూచుకొనక, పరులకోసమని ప్రాణములను సయితము తృణీకరించిన మహనీయుఁడు.
ఆతని పుత్రులు పౌత్రులు నేఁడు ధన్యుఁడగు నాతనిని ధ్యానించుచుఁ, దామును ధన్యులమే యని తలంతురు. ఏఁడాది కొకతూరి, ఆ కోఁతల రోజులలొ - ఆ యమావాస్యనాడు, ఆతని పుత్రులు హైందవ ధర్మానుసారముగ ధీరపురుషుని చరిత్రను సంస్మరించుకొంచు, ధన్యులగుచున్నారు.


పండిత కొత్త సత్యనారాయణ చౌదరి
ధీరుడైన
తమ పితామహుని స్మరించుకుంటూ -

నెనరు:
సుస్ధిర యశో ను రక్తిని జూపనేర్చి
పరుల కోసమె యసువులఁబాసి తనదు
పుత్త్ర పౌత్త్రుల కాదర్శ భూతుడైన
ధన్యు నస్మత్పితామహుందలఁచు తొలుత. -సత్యనారాయణ చౌదరి

కధావింశతి’ నుండి - రచన: పండిత కొత్త సత్యనారాయణ చౌదరి




అనుపమ కొత్త
D/o డాక్టర్ శేఖరం కొత్త,డాక్టర్ మాధవి
కొత్త సత్యనారాయణ చౌదరి,శ్రీమతి వెంకట సుబ్బమ్మ గారల మనుమరాలు


Kum. Anupama Kotha

Tampa, FL (Jun 07, 2002)

Student Volunteer Who Discovers a Way to Kill Cancer Cells Starts an Intership at Moffitt.

Anupama Kotha, was a 14-year-old student research volunteer at H. Lee Moffitt Cancer Center & Research Institute when she discovered that resveratrol, a grape extract, can kill cancer cells. Now 17, she is a Moffitt student intern continuing to study how resveratrol affects the proliferation of normal and tumor-induced cells.

Kotha became interested in cancer research three years ago, inspired by the fact that some of her family members have had cancer. As a freshman at King High School, she began a science project on a based on the theory that compounds in grapes can fight cancer. She has based her study on the French Paradox: French people eat rich food yet have a lower rate of heart disease than Americans. This paradox has been attributed to the protective affects of resveratrol that is
present in wine made from red grapes. Although the French Paradox has been studied and results reported, Kotha’s findings came at time when little was known about the anti-tumor properties of resveratrol. Kotha said, “I was amazed to see that such simple work could yield such outstanding results especially because they were unexpected.”

She has been a student research volunteer for the last three years at Moffitt in Dr. Richard
Jove’s laboratory; Jove is the Program Leader of the Molecular Oncology Program. Kotha credits Jove for being supportive throughout her project and an amazing guiding force in study development and execution. She is now a summer intern at Moffitt.

The summer interns, under the direction of Moffitt faculty, work in Cancer Center laboratories,
attend seminars and mix with graduate and postdoctoral fellows. Junior and senior faculty at the
University of South Florida College of Medicine and Moffitt Cancer Center provide additional
leadership and mentoring. Anu’s achievements are extraordinary, especially for a high school
student,” says Dr. Jove. “Since her initial observations, other laboratories have independently
made similar findings and confirmed her results, which she plans to publish after completing her
studies this summer.”Her accomplishments include winning the Best of Fair three years in a row in the senior division of Hillsborough County’s science fair competition, winning the Best of Fair at the state science fair this year and being honored by the Athena Society as one of the top ten
Young Women of Promise. She is also among 21 U.S. students who will travel to South Korea this
summer to study with some of the top researchers in the biotechnical field. Kotha would like to
attend an Ivy League medical school when she graduates and pursue a career in
pharmaceuticals.

In 2001, the National Cancer Institute awarded Moffitt
the status of a Comprehensive Cancer Center in recognition of its excellence
in research and contributions to clinical trials, prevention and cancer control.
Additionally, Moffitt is a member of the National Comprehensive Cancer Network,
a prestigious alliance of the country's leading cancer centers, and is listed
in the U.S. News & World Report as one of the top cancer hospitals in America. Moffitt’s
sole mission is to contribute to the prevention and cure of cancer.\

Source : http://www.moffitt.org/Site.aspx?spid=3CD32CE589E74F46A208E5510CC536C8

Moffitt Cancer Center News,( America’s Best Hospitals for cancer.Tampa, FL)


................................



62nd Annual STS (2002-2003) Finalists Anupama Kotha

FLORIDA
Anupama Kotha, 17, of Tampa, was named a finalist in the Intel Science Talent Search for her medicine and health project, studying resveratrol (RES)-a natural antioxidant found in grapes and red wine-and its potential anticancer properties. In research performed at the H. Lee Moffitt Cancer Center over a 3.5-year period, Anu worked on both lab-supplied mouse fibroblast cells (containing a gene that induces cancer) and human cancer cells. Through various methodologies, including flow cytometry analysis and immunohistochemical staining, she concluded that RES induces "cellular suicide" in cancer cells by inhibiting the signaling pathways necessary to induce cell growth and prevent cell death. She hopes her research has the potential to help prevent cancer and other tumor-related diseases. A student at C. Leon King High School, and a Girl Scout since the first grade, Anu is the winner of numerous honors, including three awards at the Intel ISEF. She has also won statewide competitions in Indian classical dance. Born in India and the daughter of Drs. Kotha and Madhavi Sekharam, she plans to study molecular biology at Harvard.

NOTE: According to Anu, Seventeen Magazine has run a two-page feature recognizi

Source: http://www.societyforscience.org/contactus.html
Society for Science & the Public
1719 N Street, N.W.
Washington, DC 20036

....................................


Resveratrol inhibits Src and Stat3 signaling and induces the apoptosis of malignant cells containing activated Stat3 protein:

Anupama Kotha1, Madhavi Sekharam1,2,3, Lucia Cilenti4,5, Khandaker Siddiquee4,5, Annette Khaled4,5, Antonis S. Zervos4,5, Bradford Carter2,3, James Turkson4,5 and Richard Jove6,7

1 Molecular Oncology and 2 Breast Cancer Programs, H. Lee Moffitt Cancer Center and Research Institute; 3 Department of Interdisciplinary Oncology, University of South Florida College of Medicine, Tampa; 4 BioMolecular Science Center, and 5 Department of Molecular Biology and Microbiology, University of Central Florida, Orlando, Florida; 6 Experimental Therapeutics Program, City of Hope Comprehensive Cancer Center, and 7 Division of Molecular Medicine, Beckman Research Institute, City of Hope, Duarte, California

Requests for reprints: James Turkson, BioMolecular Science Center, University of Central Florida, 12722 Research Parkway, Orlando, FL 32826. Phone: 407-882-2441; Fax: 407-384-2062. E-mail: jturkson@mail.ucf.edu

Resveratrol is a naturally occurring phytoalexin with antioxidant and antiinflammatory properties. Recent studies suggest that resveratrol possesses anticancer effects, although its mechanism of action is not well understood. We now show that resveratrol inhibits Src tyrosine kinase activity and thereby blocks constitutive signal transducer and activator of transcription 3 (Stat3) protein activation in malignant cells. Analyses of resveratrol-treated malignant cells harboring constitutively-active Stat3 reveal irreversible cell cycle arrest of v-Src-transformed mouse fibroblasts (NIH3T3/v-Src), human breast (MDA-MB-231), pancreatic (Panc-1), and prostate carcinoma (DU145) cell lines at the G0-G1 phase or at the S phase of human breast cancer (MDA-MB-468) and pancreatic cancer (Colo-357) cells, and loss of viability due to apoptosis. By contrast, cells treated with resveratrol, but lacking aberrant Stat3 activity, show reversible growth arrest and minimal loss of viability. Moreover, in malignant cells harboring constitutively-active Stat3, including human prostate cancer DU145 cells and v-Src-transformed mouse fibroblasts (NIH3T3/v-Src), resveratrol treatment represses Stat3-regulated cyclin D1 as well as Bcl-xL and Mcl-1 genes, suggesting that the antitumor cell activity of resveratrol is in part due to the blockade of Stat3-mediated dysregulation of growth and survival pathways. Our study is among the first to identify Src-Stat3 signaling as a target of resveratrol, further defining the mechanism of antitumor cell activity of resveratrol and raising its potential application in tumors with an activated Stat3 profile. [Mol Cancer Ther 2006;5(3):621–9]


Grant support: National Cancer Institute grants CA106439 (J. Turkson) and CA55652 (R. Jove).

The costs of publication of this article were defrayed in part by the payment of page charges. This article must therefore be hereby marked advertisement in accordance with 18 U.S.C. Section 1734 solely to indicate this fact.

Received 7/21/05; revised 12/12/05; accepted 1/11/06.

This article has been cited by other articles:


Home page
CarcinogenesisHome page
S. A. Gatz and L. Wiesmuller
Take a break--resveratrol in action on DNA
Carcinogenesis, February 1, 2008; 29(2): 321 - 332.
[Abstract] [Full Text] [PDF]


Home page
Cancer Epidemiol. Biomarkers Prev.Home page
D. N. Syed, N. Khan, F. Afaq, and H. Mukhtar
Chemoprevention of Prostate Cancer through Dietary Agents: Progress and Promise
Cancer Epidemiol. Biomarkers Prev., November 1, 2007; 16(11): 2193 - 2203.
[Abstract] [Full Text] [PDF]


Home page
Mol. Endocrinol.Home page
J. L. Barclay, S. T. Anderson, M. J. Waters, and J. D. Curlewis
Characterization of the SOCS3 Promoter Response to Prostaglandin E2 in T47D Cells
Mol. Endocrinol., October 1, 2007; 21(10): 2516 - 2528.
[Abstract] [Full Text] [PDF]


Home page
CarcinogenesisHome page
C. Agarwal, A. Tyagi, M. Kaur, and R. Agarwal
Silibinin inhibits constitutive activation of Stat3, and causes caspase activation and apoptotic death of human prostate carcinoma DU145 cells
Carcinogenesis, July 1, 2007; 28(7): 1463 - 1470.
[Abstract] [Full Text] [PDF]


Home page
Clin. Cancer Res.Home page
N. Suh, S. Paul, X. Hao, B. Simi, H. Xiao, A. M. Rimando, and B. S. Reddy
Pterostilbene, an Active Constituent of Blueberries, Suppresses Aberrant Crypt Foci Formation in the Azoxymethane-Induced Colon Carcinogenesis Model in Rats
Clin. Cancer Res., January 1, 2007; 13(1): 350 - 355.
[Abstract] [Full Text] [PDF]


Home page
Endocr Relat CancerHome page
S. Rice and S. A Whitehead
Phytoestrogens and breast cancer -promoters or protectors?
Endocr. Relat. Cancer, December 1, 2006; 13(4): 995 - 1015.
[Abstract] [Full Text] [PDF]


Source: http://mct.aacrjournals.org/cgi/content/abstract/5/3/621

............................................

Cancer Cure Reported by: Janet Wu

It's fair to say that for most teenagers socializing is more important than studying. But Anu Kotha is consumed with saving the lives of others. Her goal is to wipeout a deadly disease. Healthcast reporter Janet Wu shows us a young woman's quest to cure cancer.

Whether she is hanging out with friends, doing homework on the computer, 17-year-old Anu Kotha seems like any other high school senior. But all agree that there's something special about her.

Dr. Richard Jove, M.D., Moffit Cancer Center
"She's very unique and an inspiration I think to all students..."

Anu is on a quest to cure cancer. For her it's personal.

Anu Kotha
"I knew from an early age I wanted to work with cancer. It runs in the family and I have seen many friends be affected by it."

Anu has already made great strides. It all began with her freshman science project. She decided to study Reservitol a compound in grapes believed to be a powerful antioxidant.

Anu Kotha
"The grapes seed and skin, that's where it's found. They produce it as a defense mechanism."

So at the tender age of 14, Anu Russled up her courage, went to the Moffitt Cancer Center and asked if she could put reservitol to the test.

Dr. Richard Jove
"She came to me with a very specific idea, that showed me she had researched her topic very, very thoroughly..."

Dr. Jove agreed to let her work along side his scientists.

Anu Kotha, Teen Scientist
"The first years of my research I spent on non-human cells basically mouse fiberglass cells."

Anu discovered the compound could kill tumor cells while having no effect on the healthy cells. Further testing on human cancer cells found the same thing.

Dr. Richard Jove
"We realized actually very early on that she had something. What is extraordinarily about her is to be able to do research side by side with other physicians and scientists, who are very highly trained."

Anu Kotha
"I love science from the beginning and then particularly the research was just seeing cancers effects on people on the whole and realizing that this is not something that should be here and we need to do something about it."

Anu's work is getting her lots of national and international recognition. She's in November's issue of Seventeen Magazine. MIT has named a planet after her, but her focus is her work.

Anu Kotha
"Maybe these compounds can be used as a form of prevention or in conjunction with chemo-thearapy or other methods of treatments for cancer."

…A promising idea for a young scientist.

Source : http://www3.whdh.com/features/articles/healthcast/H1153/

..............

Tissue Engineering at Pratt January 1, 2003

By Anu Kotha

(Kotha is a freshman at Pratt)

Within the next 10 years, more than 70 million people are going to join the ranks of seniors. As they age, they will face several medical problems. One such problem concerns joints. The articular cartilage that allows bones to smoothly move over each other wears down with time. Unlike most tissues in the body, articular cartilage cannot heal itself. Due to the loss of this cartilage, bones rub against each other and cause tremendous pain at the joints, especially at the knee.

At this time, the best option to alleviate serious pain is knee-joint replacement. Approximately 200,000 total knee joint operations are performed annually at a cost of about $26,000 per replacement. Usually these artificial joints last only 10-15 years. A less painful option may be available in future. This solution is brewing at Duke University.

Researchers under the leadership Professor Lori Setton are working on a biomaterial that can be implanted at the knee joint. The biomaterial, Elastin-like polypeptides (ELP), has unique properties that make it attractive as an injectable scaffold for cartilaginous tissue repair. These artificial polypeptides are native to the elastin found in muscle, cartilage, and other soft tissues, and thus can evade detection by the immune system. This decreases the chances of rejection of the biomaterial by the body. When in the gel-like state, ELPs possess mechanical properties that approach that of native cartilaginous tissues. Setton’s lab has genetically modified ELPs so that they will transition from liquid to the gel-like coacervate when inside the human body. ELPs, however, lack the strength to withstand the pressure that occurs at the knees. The lab is working on strengthening ELPs by crosslinking these polypeptides in the presence of enzymes or visible light from lasers. Setton was recently awarded a $1.45 million grant for this tissue cartilage work.

If all works well, according to Setton, the lab may have a biomaterial that attains physical properties of cartilaginous tissues for the repair of not only knees but various joints and invertebral discs. This goal of creating biomaterials for the purpose of alternative therapies for minimally invasive intervention to inhibit the progression of disease and eliminate total joint replacement is one of the hallmarks of the field of tissue engineering.

Tissue engineering is a rapidly expanding area combining the disciplines of biology and engineering to solve medical problems. The goal is to develop and manipulate laboratory-grown molecules, cells, tissues or organs for the purpose of restoring, maintaining or improving the function of human tissues or organs. Commercially produced skin is already available to treat patients with diabetic ulcers and burns. Scientists have engineered blood vessels from adult pigs’ arteries to act like human vessels. In 5-10 years, regeneration of such blood vessels, bone, and skin may become routine. Tissue engineering offers the possibilities of building deficient osteoporotic bone or stopping cancer cells by choking off their blood supply. This field is attractive for industry since new developments for treatments of diseases will be relatively inexpensive compared to today’s methods.

As seen with the development of cartilage, tissue engineering may provide us a future where body parts are available to purchase. Though this scenario is years away, the possibility of having new options to treat diseases is exciting and offers hope for the betterment of human health.

Source : http://www.bme.duke.edu/news/?id=674

http://secure.pratt.duke.edu/pratt_press/web.php?sid=98&iid=13